సాధారణంగా గృహిణిలు ఇంట్లో పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతో శ్రమిస్తుంటారు. వారి శ్రమ వెలకట్టలేనిది. ఇంటి పనుల్లో భాగంగా కుటుంబ సభ్యుల దుస్తులను ఉతకటం మనేది పెద్ద వర్క్. అయితే ఇటీవల వాషింగ్ మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం అనే వర్క్ చాలా తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటెర్జెంట్ పౌడర్, ఇతర ద్రావణాలకు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికిపెడితే ఎంత బాగుంటుందో కదా? అలా అనుకునే వారికి .. చండీగఢ్ కు చెందిన అంకుర సంస్థ 80వాష్ ఓ చిత్రమైన, అద్భుతమైన వాషింగ్ మిషిన్ నే తయారు చేసింది. మరి.. చిటికెలో దుస్తులను ఉతికే ఆ మిషిన్ గురించి ఇప్పుుడు తెలుసుకుందాం.
వాషింగ్ మిషిన్లు ఎంత మనకు పని తగ్గించిన, నీళ్ల వాడకం విషయంలో పెద్దగా మార్పు ఏమిలేదు. కొంచెం మురికిని వదిలించాలన్నా సుమారు 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి. దుస్తులు శుభ్రంగా కావటానికి వాడే సబ్బు పౌడర్ , ద్రవాణంలోని రసాయనాలతో కూడిన నీరంతా మురికి కాల్వల్లోకే చేరుతుంది. ఇలా చివరికి చెరువుల్లోకి చేరి.. నీటిని కాలుష్యం కూడా చేస్తుంది. అయితే తక్కువ నీటితో..కేవలం కప్పు నీటితోనే ఐదు దుస్తులను ఉతికేస్తుంది 80 వాష్ అనే అంకుర సంస్థ తయారు చేసిన మిషిన్. సబ్బు అవసరం కూడా లేకుండానే.. కేవలం 80 సెకన్లలోనే దుస్తులను ఉతికి పెడుతుంది. మురికి ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. 80 వాష్ అనే అంకుర సంస్థను రూబుల్ గుప్తా, నితిన్ కుమార్ సలుజా, వరిందర్ సింగ్ ఆరంభించారు. వీరి వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న వాషింగ్ మిషిన్ ఒకవైపు నీటిని ఆదా చేస్తూనే.. మరోవైపు నీటి కాలుష్యాని నివారిస్తుంది.
ఇలా ఒకే సారి రెండు సమస్యలకు పరిష్కారం చూపుతుంది.. ఈ కొత్త మిషన్. స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇది తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేైవ్ పరిజ్ఞానం సాయంతో దుస్తుల్లో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దుస్తులను మాత్రమే కాదు.. లోహ వస్తువులను, పీపీఈ కిట్లనూ శుభ్రం చేస్తుంది. గది ఉప్ణోగ్రత వద్ద ఉత్పత్తి అయ్యే పొడి ఆవిరి సాయంతో దుస్తుల మీద ఉన్న దుమ్ము, ధూళితో పాటు రంగు మరకలనూ పోగొడుతుంది. ఈ మిషిన్ కి 7 నుంచి 8 కిలోల దుస్తువులను ఉతికే సామర్ధ్యం ఉందని 80 వాష్ సంస్థ చెబుతోంది. దీనికి కేవలం 5-6 గ్లాసుల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం ఈ వాషింగ్ మిషిన్ ను ప్రయోగాత్మక పరీక్షల కోసం మూడు పట్టణాల్లో 7 చోట్ల అమర్చారు.
అయితే ఈ విన్నూత వాషింగ్ మిషన్ ఆలోచన పంజాబ్ లోని చిత్కర యూనివర్సటీ ఇంక్యూబేషన్ సెంటర్ మొగ్గు తొడిగింది. రూబుల్ గుప్తా 2017లో బీటెక్ చేస్తున్న సమయంలో దీనికి బీజం పడింది. నిపుణుల అభిప్రాయం తీసుకుని చివరికి వాషింగ్ మిషిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి నితిన్, వరిందర్ సింగ్ లు తోడయ్యారు. దుస్తులను ఉతకటానికి అతినీలలోహిత కిరణాలు సరిపోవు. ఈ కిరణాలు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది గానీ మురికిని వదిలించలేదు. అందుకే ఈ పొడి ఆవిరి పరిజ్ఞానంతో ప్రయత్నించి విజయం సాధించారు. మరి.. ఈ కొత్త వాషింగ్ మిషిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.