ప్రముఖ షార్ట్ వీడియో యాప్ ‘టిక్ టాక్‘ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు గంటలు గంటలు వీడియోలు చేసుకుంటూ ఈ యాప్ లో గడిపినవారెందరో ఉన్నారు. ఈ క్రమంలో కొందరు యూజర్లు ఓవర్ నైట్ స్టార్స్ గ కూడా మారిపోయారు. ఓవరాల్ గా టిక్ టాక్ పలువురికి మంచి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఉప్పల్ బాలు, జబర్దస్త్ దుర్గారావు, యాంకర్ దివ్య శ్రీ.. ఇలాంటి వారందరూ ఈ యాప్ ద్వారా పాపులర్ అయినవారే. అంతలోనే భారత్ – చైనా మధ్య తగాదాలు ఏర్పడడంతో.. కేంద్ర ప్రభుత్వం చైనీస్ యాప్స్ పై నిషేధం విధించింది. దేశభద్రతకు ముప్పుపొంచి ఉందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అంతే.. టిక్ టాక్ ఓవర్ నైట్ స్టార్స్ అందరూ గల్లంతయ్యారు. అలాంటి వారికి రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. రిలయన్స్ జియో త్వరలోనే షార్ట్ వీడియో రంగంలోకి అడుగుపెట్టనుందట. అందుకోసం రోలింగ్ స్టోన్ అనే కంపెనీతో టై అప్ అయినట్లు వార్తలొస్తున్నాయి. యాప్ పేరు.. ‘platfom’ అని తెలుస్తోంది. ఈ యాప్ లోకి తొలుత 100 మందిని మాత్రమే అనుమతించనున్నారట. వీరికి గోల్డ్ టిక్ మార్క్ కూడా ఇస్తారట. ఆ తరువాత అందరికీ అనుమతి ఇవ్వొచ్చని సమాచారం. ఇక్కడ ఆనందాన్ని ఇచ్చే విషయమేమి అంటే.. ‘జియో టిక్ టాక్’ ప్లాట్ ఫామ్ platfomలో వీడియోస్ చేసే వారికి మానిటైజేషన్ ఎనేబుల్ చేయనున్నారట. అంటే.. వ్యూస్ ని బట్టి డబ్బులు ఇస్తారట. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి రానుందని సమాచారం.
Rolling Stone India, Creativeland Asia and Jio Platforms launch short-video app launch Platfom..@Creativeland #JioPlatforms @rajkurup #KiranThomas #CreativelandAsia
https://t.co/JPQu7tuCMe— medianews4u.com (@medianews4u) November 24, 2022
Rolling Stone India, Creativeland Asia and Jio Platforms Limited, have come together to launch a new short-video app for entertainers. The new initiative, titled Platfom™, aims to become the ultimate destination for Indian entertainers.
READ: https://t.co/QU7Iylnot8 pic.twitter.com/ZZMGAIEHJ7
— Music Plus: News + Features (@musicplusindia) November 28, 2022