హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేసిన e-bike ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించవచ్చని నిరూపించింది. గ్రావ్టన్ మోటార్స్ అనే కంపెనీ తయారు చేసిన e-bike ఒక సారి ఛార్జింగ్ తో 4 వేల 11 కి.మీ ప్రయాణించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ బ్యాంక్.. ఒకేసారి 5 వేల ఫోన్స్ ఛార్జ్..!
e-bike కన్యాకుమారి నుంచి లడఖ్లోని ఖర్దుంగ్కు ఒక్క ఛార్జ్ తోనే నడవడం విశేషం. ఇందుకు ఈ బైక్ తీసుకున్న మొత్తం సమయం 164 గంటల 30 నిమిషాలు. అంటే ఏడు రోజుల కంటే తక్కువ. దీంతో ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. సెప్టెంబర్ 13, 2021న కన్యాకుమారి నుంచి ఈ బైక్ ప్రయాణం ప్రారంభమై సెప్టెంబర్ 20, 2021న ముగిసింది. .
ఈ బైక్ నడిపిన వారు ముందుగా కన్యాకుమారి నుంచి మనాలి వరకు 3,400 కి.మీ నాన్ స్టాప్ జర్నీ చేశారు. మనాలిలో రాత్రంతా బస చేశారు. ఆ తర్వాత వారు మిగిలిన మార్గం ప్రయాణించారు. ఈ ప్రయాణ మార్గంలో ఎక్కడా బైక్ లో ఎలాంటి సమస్యలు రాలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ బైకుకు Quanta అని పేరు పెట్టారు. భవిష్యత్తులో దీన్ని మరింత శక్తివంతంగా తయారుచేస్తామని కంపెనీ తెలిపింది. 2022 చివరి నాటికి బైక్ లను మార్కెట్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.