ఒకప్పుడు సమాచార మార్పిడి జరగాలంటే.. మనుషులు ప్రయాణించి.. తెలియజేయాల్సిన వారికి.. సమాచారం అందజేసి వచ్చేవారు. ఆ తర్వాత వారి స్థానంలో.. పావురాలు సమాచార మార్పిడికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఉత్తరాలు, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా సమాచార మార్పిడి జరిగేది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది సమాచార మార్పిడిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మెయిల్, మెసేజ్.. ఇప్పుడు ఏకంగా.. వీడియో కాల్ ద్వారా.. సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే.. వారి దగ్గరకు వెళ్లే అవసరం లేదు. మనం ఉన్న చోట నుంచి కాలు కదిపే పని లేకుండా.. చేతిలోకి ఫోన్ తీసుకుని నంబర్ డయల్ చేస్తే చాలు. ఆడియో, వీడియో ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. మనిషి సెల్ఫోన్ని అభివృద్ధి చేశాక.. ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులను కూడా మన స్క్రీన్ తెర మీద చూస్తూ మాట్లాడే అవకాశం కలిగింది.
అయితే ఇప్పుడు మనం వాడుతున్న ఈ సెల్ఫోన్ కూడా అనేక మార్పులకు లోనవుతూ.. కొత్త కొత్త సాకేంతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకుంటూ.. నేటి స్మార్ట్ ఫోన్గా మారింది. ఇక సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన ప్రారంభంలో.. సమాచార మార్పిడిని నిమిషాల్లో కొలిచాం. అంటే ఎన్ని నిమిషాలు మాట్లాడితే.. అంత ఎక్కువ బిల్లు అన్నట్లుండేది.. అలా మొబైల్ టెక్నాలజీ.. ‘1జీ.. 2జీ’ అంటూ మెల్లగా తన నడక ప్రారంభించింది. అయితే ‘ 3జీ ’ అభివృద్ధితో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. 3జీ తర్వాత కొన్నాళ్లకే.. 4జీ అందుబాటులోకి వచ్చి.. మన జీవితాలు మరింత వేగవంతం అయ్యాయి.
4జీ ఆవిష్కరణ.. మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రావడం.. 4జీ టెక్నాలజీ కారణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మన దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికా, చైనా వంటి దేశాల్లో 5జీ ఎప్పుడో అందుబాటులోకి రాగా.. మన దేశంలో మాత్రం.. 2022లోనే 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మరి అయితే మనకు 3జీ, 4జీ, 5జీ వీటి గురించి తెలుసు.. కానీ జీరో (0)జీ కూడా ఉందని మీకు తెలుసా.. అసలు 0జీ అంటే ఏంటి.. ప్రసుత్తం ఇది అందుబాటులో ఉందా.. లేక రావాల్సి ఉందా.. వంటి వివరాలు..
ప్రస్తుతం మనం 5జీ సాంకేతికతను వినియోగిస్తునఆనం. కానీ వీటితో పాటు 0జీ తరం కూడా ఉంది. అదే రేడియో తరంగాల ఆధారంగా పనిచేసే వైర్లెస్ ఫోన్లు. అయితే 1 జీ తర్వాత వీటి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. అయితే వీటికి ఖర్చు, సాంకేతికత అంతగా అవసరం లేదు కాబట్టి మళ్లీ వీటికి ప్రాధాన్యం రావచ్చని నమ్ముతున్నారు.
రేడియో తరంగాల ఆధారంగా పనిచేసే మొబైల్ ఫోన్ను 1917లోనే కనిపెట్టారు. కానీ ‘సెల్ఫోన్ సాంకేతికత’ అని చెప్పుకోగలిగే తొలి తరం (1జీ) మొబైల్ను మాత్రం 1973లో అభివృద్ధి చేశారు. ‘మోటరోలా’ కంపెనీ తొలి సెల్ఫోన్ని విడుదల చేసింది. దీని బరువు రెండు కిలోలు ఉండేది. అయితే క్రమంగా 2జీ, 3జీ, 4జీ వంటి అందుబాటులోకి రావడం.. బటన్లు నొక్కే ఫీచర్ ఫోన్నుంచి, సకల సౌకర్యాల ఉన్న స్మార్ట్ ఫోన్వరకూ సాంకేతికత అభివృద్ధి చెంది. అలానే సెల్ఫోన్ పనితీరు నుబట్టి జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ, ఎల్టీఈ.. అంటూ ఇలా రకరకాల పేర్లు ఉండేవి.
ఇక ప్రస్తుతం ఆవిష్కరించిన 5జీ మన జీవితాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకురాబోతున్నది. అరచేతిలో ఉండే ఫోన్ ఎన్నో అద్భుతాలు చేయనుంది. 5జీ అందుబాటులోకి రావడంతో.. మన రోజు వారి జీవితంలో IoT ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ పరికరాల సంఖ్య పెరగనుంది. ఇక మీదట.. చేతికుండే వాచీల దగ్గర నుంచీ ఇంట్లోని బల్బుల వరకూ ఈ సాంకేతికత ఆధారంగానే పని చేస్తాయి. వీటిలో చాలా వాటికి మొబైల్ ఇంటర్నెట్ కీలకం. ఇక 4జీతో పోల్చుకుంటే 5జీతో పరికరాల అనుసంధాన సామర్థ్యం వందరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే, 5జీ సాంకేతికత ద్వారా ఒక చదరపు కిలోమీటర్లోని పది లక్షల పరికరాలను అనుసంధానించవచ్చు అంటున్నారు నిపుణులు.