ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ యుగంలో అంతా అన్ని వస్తువులు స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ టీవీలకు ఎంతో డిమాండ్ పెరిగింది. కానీ, రేటు పరంగా స్మార్ట్ టీవీలు కాస్త ప్రియంగా ఉంటాయని వినియోగదారులు కొనేందుకు వెనుకాడుతుంటారు. అయితే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఇప్పుడు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తోంది అమెజాన్. సెప్టెంబర్ 23నుంచి ఈ సేల్ ప్రారంభంకానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం 24 గంటల ముందే ఈ సేల్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాకుండా నాన్ ప్రైమ్ మెంబర్స్ కంటే ప్రైమ్ మెంబర్స్ కోసం అత్యధిక డిస్కౌంట్స్ ప్రకటించారు. ఈ సేల్లో స్మార్ట్ టీవీలు ఎంత ధర ఉన్నాయో చూద్దాం.
వన్ ప్లస్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లే కాదు.. టీవీలకు కూడా అత్యధిక డిమాండ్ ఉంది. కానీ రేటు ఎక్కువగా ఉంటాయని వన్ ప్లస్ టీవీలను కొనేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఈ సేల్లో రూ.19,999 ఎమ్మార్పీ కలిగిన వన్ ప్లస్ Y1 సిరీస్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం రూ.9,749కే అందిస్తున్నారు. ఈ టీవీ వైఫై, హెచ్డీఎంఐ కనెక్టివిటీ, 1 జీబీ ర్యామ్, ఎంటర్టైన్మెంట్ యాప్స్ సపోర్ట్ వంటి ఫీచర్లతో లభిస్తోంది.
రెడ్ మీ స్మార్ట్ టీవీలకు చాలా డిమాండ్ ఉంటుంది. అన్ని స్మార్ట్ టీవీలతో పోలిస్తే రెడ్ మీ టీవీలు కాస్త తక్కువ ధరకే లభిస్తుంటాయి. కానీ, గత సంవత్సర కాలంగా ఆ టీవీలు కూడా కాస్త ధరలు పెరిగాయి. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో రూ.24,999 ఎమ్మార్పీ కలిగిన రెడ్ మీ 11 సిరీస్ స్మార్ట్ టీవీని కేవలం రూ.8,999కే అందిస్తున్నారు. నాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ టీవీని రూ.9,161కి పొందవచ్చు.
అన్ని స్మార్ట్ టీవీల కంపెనీలకు అమెజాన్ బేసిక్స్ సంస్థ కూడా గట్టి పోటీనే ఇస్తోంది. స్మార్ట్ గాడ్జెట్స్, టీవీలు ఇలా చాలా ఉత్పత్తులను అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా మరిన్ని ఆఫర్లు ప్రకటించారు. స్మార్ట్ టీవీల విషయానికి వస్తే.. రూ.27,000 ఎమ్మార్పీ కలిగిన 32 ఇంచెస్ హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీని కేవలం రూ.8,999కే అందిస్తోంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి రూ.13,499 ధరను నిర్ణయించారు.
ఎలక్ట్రానిక్స్ పరంగా తొషిబా ఉత్పత్తులకు ఎంతో మంచి ఆదరణ, నమ్మకం ఉంది. టీవీలు, వాషింగ్ మెషిన్స్ వంటి గృహోపకరణాల కోసం తొషిబా కంపెనీ ఉత్పత్తులను ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సేల్లో రూ.24,990 ఎమ్మార్పీ కలిగిన తొషిబా V సిరీస్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం రూ.10,990కే కొనుగోలు చేయవచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి రూ.11,188కి అందుబాటులో ఉంది.
వన్ ప్లస్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ Y సిరీస్లో మరో మోడల్ టీవీ కూడా అందుబాటులో ఉంది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా రూ.21,999 ఎమ్మార్పీ కలిగిన వన్ ప్లస్ Y1S 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,990కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టీవీలో 20 వాట్స్ డాల్బీ ఆడియో, 64 బిట్ పవర్ఫుల్ ప్రాసెసర్, ఓకే గూగుల్, అలెక్సా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏసర్ అనే బ్రాండ్ చాలా పాతదే అయినా ఇటీవలి కాలంలో దీని పేరు అంతగా వినిపించడం లేదు. కానీ అదిరిపోయే ఫీచర్లతో 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఏసర్ అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా రూ.22,990 ఎమ్మార్పీ కలిగిన ఏసర్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999కే అందిస్తున్నారు. నాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ టీవీని రూ.13,499కి కొనుగోలు చేయచ్చు. దీనిలో 40 వాట్ ఇన్బిల్ట్ సౌండ్ బార్ కూడా ఉంది.
టీసీఎల్ కంపెనీకి చెందిన 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కూడా మంచి ఆఫర్లో అందుబాటులో ఉంది. రూ.30,990 ఎమ్మార్పీ కలిగిన 32 ఇంచెస్ టీసీఎల్ స్మార్ట్ టీవీ ఈ ఫెస్టివల్ సేల్లో కేవలం రూ.11,990కే అందిస్తున్నారు. డాల్బీ ఆడియో, గూగుల్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఈ టీవీలో అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ కేటగిరీలో కాంపాక్ అనే కంపెనీకి చెందిన 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కూడా అతి తక్కువ ధరలో లభిస్తోంది. రూ.15,999 ఎమ్మార్పీ కలిగిన ఈ టీవీని 50 శాతం డిస్కౌంట్తో కేవలం రూ.8.079కి మాత్రమే అందిస్తున్నారు. ఈ టీవీలో వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 20 వాట్స్ స్పీకర్స్, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. ఇది స్లీక్ ఎడ్జ్ మోడల్లో ఆల్ స్క్రీన్ అని అందుబాటులోకి వస్తోంది. అంటే మీకు మొత్తం స్కీన్ కనిపిస్తుంది.
ఎంఐ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 5ఏ సిరీస్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీపై అద్భుతమైన తగ్గింపు అందిస్తున్నారు. రూ.24,990 ఎమ్మార్పీ కలిగిన 5ఏ స్మార్ట్ టీవీని కేవవలం రూ.10,990కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీలో హెచ్డీ డిస్ప్లే, 20 వాట్ డాల్బీ స్పీకర్స్, ఓకే గూగుల్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ రోమ్ డీటీఎస్ వర్చువల్ వంటి అద్భుమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో హ్యూండాయ్ కంపెనీకి చెందిన రూ.22,990 ఎమ్మార్పీ కలిగిన 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం రూ.11,990కే అందిస్తున్నారు. హెచ్డీ డిస్ప్లే, వైఫై, బ్లూటూత్, వాయిస్ కంట్రోల్ రిమోట్, థండర్ స్పీకర్స్, లైవ్ న్యూస్, 20,000కు పైగా ఫ్రీ మూవీస్ అన్ని ఓటీటీ యాప్స్ ను కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. బెజల్ లేకుండా ఫుల్ స్క్రీన్ మోడల్ లో ఈ టీవీ రూపొందించారు.