ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ లు జరిగినాగానీ స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఒక్కదేశంలో మాత్రం గత 17 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కటి టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఆ దేశమే పాకిస్థాన్. 2009లో జరిగిన స్టేడియం దగ్గర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల ఎటాక్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఏడాది నుంచే పాకిస్థాన్ పర్యటనకు దూరం అయ్యాయి విదేశీ జట్లు. అయితే పాక్ కు రావడానికి విదేశీ జట్లు ఎందుకు భయపడుతున్నాయి? తీవ్రవాదుల భయమే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి పాక్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ కు భయం లేదా? దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్.. ప్రపంచ పటంలో తాలిబన్ దేశంగా ముద్రపడ్డ ఓ చిన్న దేశం. కానీ క్రికెట్ లో మాత్రం అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ.. ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగింది. ఒకానొక క్రమంలో పాక్ ను ఓడించాలంటే వరల్డ్ క్లాస్ జట్లకు సైతం వల్ల కాకపోయేది. అలాంటి జట్టు ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు తలవంచుకు నిలబడుతోంది. 2009లో పర్యటించిన శ్రీలంక జట్టే పాక్ లో పర్యటించిన ఆఖరి జట్టు. అప్పటి నుంచి పాక్ లో మరే విదేశీ జట్టు పర్యటించలేదు. అది 2009 మార్చి 3వ తారీఖు శ్రీలంక టెస్టు సిరీస్ కోసం పాక్ కు వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్ కోసం లాహోర్ లోని గడాఫీ స్టేడియానికి బస చేసే హోటల్ నుంచి శ్రీలంక క్రికెటర్ల బసు బయలుదేరింది. ఆ బస్సుపై టెర్రరిస్టులు ఎటాక్ చేశారు.
ఈ ఎటాక్ లో శ్రీలంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ సైతం ప్రాణాలు కోల్పొయాడు. అప్పట్లో ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదీగాక ఇంతకు ముందు కూడా చాలా బాంబు దాడులు జరగడంతో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు పాకిస్థాన్ పర్యటన అంటేనే హడలిపోయాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తో జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. తర్వాత ఈ సిరీస్ కోసంమే కివీస్ 2002లో పాక్ లో పర్యటించింది. అప్పుడే కివీస్ జట్టు ఉన్న హోటల్ బయటే బాంబు పేలుడు జరిగింది. దాంతో అదిరిపడిన కివీస్ జట్టు అర్ధాంతరంగా స్వదేశం తిరిగివచ్చింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు గురయ్యాడు. దాంతో సిరీస్ కోసం పాక్ వెళ్లాల్సిన ఆసిస్ పర్యటనను రద్దు చేసుకుంది. ముంబై దాడుల తర్వాత భారత్ కూడా పాక్ లో పర్యటించేందుకు నిరాకరించింది. దాంతో పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి మరింతగా దిగజారింది.
దాదాపు 10 సంవత్సరాల పాటు ఏ టీమ్ కూడా పాక్ లో పర్యటించలేదు. ఆ తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు పాక్ లో అడుగుపెట్టింది. దాంతో మిగతా జట్లు కూడా క్రమంగా పాక్ లో క్రికెట్ ఆడేందుకు మెుగ్గుచూపాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోసం పాక్ లో అడుగు పెట్టనుంది ఇంగ్లాండ్. ఇటీవలే దిగ్విజయంగా టీ20 సిరీస్ ను ముగించుకున్న ఇంగ్లాండ్ త్వరలోనే టెస్టు సిరీస్ కోసం పాక్ లో అడుగుపెట్టనుంది. కేవలం తీవ్రవాదుల దాడుల కారణంగానే పాక్ లో మ్యాచ్ లు ఆడటానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి అన్నది కాదనలేని వాస్తవం. ఇక టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ కు హెలికాప్టర్లతో భద్రత కల్పించిన సంగతి ప్రపంచానికి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు పర్యటిస్తుండటంతో పాక్ క్రికెట్ బోర్డుకు పునర్వైభవం వస్తోందని మాజీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 1 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.