‘వెస్టిండీస్ టూర్ ఆఫ్ పాకిస్తాన్ 2021’లో కరోనా కలకలం రేపుతోంది. వెస్టిండీస్ ఆటగాళ్లు సహా సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్టు వెల్లడించింది. పాకిస్తాన్ నిర్వహించిన రోజువారీ టెస్టుల్లో ఇద్దరు సిబ్బంది, ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ జరిగింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ పాకిస్తాన్ కు పర్యటిస్తోంది. టీ20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. రెండు మ్యాచ్ లలోనూ పాకిస్తాన్ విజయం సాధించింది. డిసెంబరు 16న మూడో టీ20 జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు కరోనా సోకడం పాక్ బోర్డును కలవర పెడుతోంది. మూడో టీ20 జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Wicketkeeper/batsman Shai Hope, left-arm spinner Akeal Hosein, allrounder Justin Greaves, along with Assistant Coach Roddy Estwick & Team Physician Dr. Akshai Mansingh returned positive results in latest round of testing carried out by Pakistan Cricket Board: Cricket West Indies pic.twitter.com/cFPIqoJUga
— ANI (@ANI) December 16, 2021
వెస్టిండీస్ టీమ్ లోని కీపర్/బ్యాట్స్ మన్ షాయ్ హోప్, స్పిన్నర్ అకీల్ హొసేన్, ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, అసిస్టెంట్ కోచ్ రోడీ ఎస్ట్ విక్, జట్టు ఫిజీషియన్ డాక్టర్ మాన్ సింగ్ లకు పాక్ బోర్డు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. మొత్తం కరోనా సోకిన ఐదుగురిని జట్టుకు దూరంగా ఐసోలేషన్ లో ఉంచినట్లు వెస్టిండీస్ బోర్డు వెల్లడించింది. పాకిస్తాన్- వెస్టిండీస్ మూడో టీ20 జరుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
A further five members of the West Indies touring party have tested positive for COVID-19 | More below: https://t.co/lOhSH1UdIu
— Windies Cricket (@windiescricket) December 16, 2021