బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది జట్లు 590 ఆటగాళ్లు పాల్గొననున్నాయి. కాగా ఈ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జాఫర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. జాఫర్ రాజీనామాతో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఆటగాళ్లే కాకుండా బ్యాటింగ్ కోచ్ కోసం కూడా వెతకాల్సి ఉంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని వసీం జాఫర్ ఫన్నీ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. రణబీర్ కపూర్ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’లోని ‘అచ్చా చల్తా హూ.. దుఆమే యాద్ రఖనా’ పాట చిత్రాన్ని పోస్ట్ చేసి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే IPL 2022 కోసం అనిల్ కుంబ్లే, మొత్తం జట్టుకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ను రూ.12 కోట్లకు, అన్క్యాప్డ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి వసీం జాఫర్ రాజీనామాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adios, and thank you @PunjabKingsIPL, it’s been a pleasure. Wishing @anilkumble1074 and the team very best for #IPL2022 🤗 pic.twitter.com/rDivb0akZp
— Wasim Jaffer (@WasimJaffer14) February 10, 2022