రోహిత్ శర్మ.. టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని హోటల్లో బీసీసీఐ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నాడు. గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోనైనా రోహిత్ మెరుస్తాడా? అని ఎదురుచూసిన అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. అయితే ఇంగ్లాండ్ పర్యటన గురించి పక్కన పెడితే ప్రస్తుతం రోహిత్ శర్మ కెరప్టెన్సీపై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడిని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ సెహ్వాగ్ బీసీసీఐకి సూచించాడు.
రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఇలా చేస్తే బావుంటుందంటూ.. వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి సలహా ఇచ్చాడు. ‘ఫలానా వ్యక్తి టీమిండియా టీ20 క్రికెట్ జట్టుకు సారధ్యం వహిస్తే బావుంటుంది అని బీసీసీఐ మనసులో ఉంటే.. రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించండి. అలా చేయడేం వల్ల రోహిత్ శర్మపై పని భారం తగ్గుతుంది. రోహిత్ శర్మ వయసు రీత్యా కూడా అతనికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుంది. అలా చేయడం వల్ల తిరిగి రోహిత్ శర్మ అటు వన్డేలు, టెస్టుల్లో పునరుత్తేజంతో బాగా రాణించే అవకాశం ఉంటుంది.’ అంటూ సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు.
రోహిత్ కెరీర్ విషయానికి వస్తే.. సౌత్ ఆఫ్రికాతో సిరీస్కు ముందు గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కు వెళ్లాడు. అయితే ఆ టూర్లో కరోనా కారణంగా ఐసోలేషన్కు వెళ్లాల్సి వచ్చింది. అటు ఐపీఎల్-2022 సంగతి చూస్తే.. రోహిత్ సారధ్యంలో 5 టైటిల్స్ కొట్టిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం టేబుల్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్లోనూ రోహిత్ పేలవ ప్రదర్శనతో అందరినీ నిరుత్సాహ పరిచాడు. ఇదంతా చూస్తుంటే పాత రోహిత్ శర్మను చూడాలంటే అతనికి తప్పకుండా విశ్రాంతి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెహ్వాగ్ చెప్పినట్లు రోహిత్ ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడమే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former Indian player Virender Sehwag feels Rohit Sharma could be relieved from captaincy duties from T20Is 🏏
📸: BCCI#RohitSharma #TeamIndia #Cricket #VirenderSehwag pic.twitter.com/Dr6C0WrM3x
— SportsTiger (@sportstigerapp) June 27, 2022