కెప్టెన్సీ మార్పుతో నిన్నటి వరకు వివిధ పుకార్లు, ప్రెస్మీట్లు, వివాదాల మధ్య ఉన్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా చాలా సరదాగా కనిపించాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. క్వారంటైన్ ముగించుకుని.. ప్రాక్టీస్ సెషన్ను ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ ఆరంభంలో ఆటగాళ్లంతా కలిసి వాలీబాల్, ఫుట్బాల్ ఆటను మిక్స్ చేసి ఆడారు.
టీమ్ మొత్తం రెండు జట్లుగా విడిపోయి ఆడింది. ఒక జట్టుకు అశ్విన్, మరో జట్టుకు కోచ్ ద్రావిడ్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు చాలా సరదాగా కనిపించారు. విరాట్ కోహ్లీ ఈ ప్రాక్టీస్ సెషన్లో సెంటర్ ఆఫ్ది అట్రాక్షన్గా నిలిచాడు. వన్డే కెప్టెన్సీను తప్పించడంతో.. కోచ్ రాహుల్ ద్రావిడ్, సహచర ఆటగాళ్లతో ఎలా ఉంటాడో అని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. కానీ.. గొడవలకు పుల్ స్టాప్ పెడుతూ.. అందరితో చాలా సరదాగా ఉన్నాడు. కోచ్ ద్రావిడ్ ప్రతిభ చూసి ఆశ్చర్యపడ్డ విరాట్.. రాహుల్ను అభినందించిన సందర్భం ఫ్యాన్స్ చాలా బాగా నచ్చింది.
ఈ మ్యాచ్లో అశ్విన్, పుజారా మధ్య మాటామాటా కూడా జరిగింది. రూల్స్ విషయంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రాక్టీస్ సెషన్ను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్టు చేసింది. వివాదాలు మరి టీమిండియా ఆటగాళ్లు ఇలా సరదాగా గడపడం.. మంచి సంకేతాలు ఇస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కోహ్లీ, ద్రావిడ్ ఇలా హ్యాపీగా హ్యాపీగా ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo’Burg? 🤔
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz
— BCCI (@BCCI) December 18, 2021