హీరోయిన్ ఊర్వశి రౌతేలా.. ఈ పేరు చెప్పగానే గ్లామర్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేసే భామనే గుర్తొస్తుంది. హిందీతోపాటు ఈ మధ్య తమిళంలో ‘ది లెజెండ్’ చిత్రంలోనూ ఓ హీరోయిన్ గా చేసింది. ఇదంతా పక్కనబెడితే వేరే విషయమై కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆసియాకప్ జరిగినన్నీ రోజులు కూడా ఈమె గురించి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. ఇప్పుడు వాటన్నింటికీ ఊర్వశి ఎండ్ కార్డ్ వేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్ల క్రితం ఊర్వశి ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. భారత క్రికెటర్ ఆర్పీ.. ఒకానొక సమయంలో హోటల్ లాబీలో తనకోసం గంటలు గంటలు ఎదురుచూశాడని చెప్పింది. ఈ పోస్టుపై సీరియస్ అయిన రిషబ్ పంత్.. పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తోందని తన ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. ఈ గొడవంతా ఊర్వశి-పంత్ మధ్య పరోక్షంగానే జరిగింది తప్ప డైరెక్ట్ గా జరగలేదు. ఇక ఈ మధ్య దుబాయిలో ఆసియాకప్ జరిగింది. దీనికి కొన్నిరోజుల ముందు అస్సలు తనకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదని, అసలు మ్యాచులు చూడనని చెప్పిన ఊర్వశి.. ఏకంగా స్టేడియానికి వచ్చిన టీమిండియా ఆడుతుంటే చీర్స్ కొట్టింది.
పాక్ యువబౌలర్ నసీమ్ షా-తన విజువల్స్ ఎడిట్ చేసిన వీడియోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని అందరూ అనుకున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఊర్వశి ఎవరో తనకు తెలియదని నసీమ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఊర్వశిపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటి గురించి ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ తో మాట్లాడింది. ఈ నాన్సెన్స్ ఆపేయాలని కోరింది. పంత్ కి కూడా ఇన్ డైరెక్ట్ గా క్షమాపణ చెప్పింది. మరి ఊర్వశి-పంత్ గొడవ.. ఇప్పుడు ఈమె సారీ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్
ఇదీ చదవండి: పాక్ క్రికెటర్ తో ఊర్వశి! వీడియో వైరల్..