ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ దీని బారిన పడుతున్నారు. ఇలాగే క్రికెట్ ఆడుతూ 16 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. టెన్త్ క్లాస్ విద్యార్థి అనూజ్ పాండే.. తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అప్పటికే 21 పరుగులు చేసిన అనూజ్.. మరో పరుగు కోసం ప్రయత్నిస్తూ ఒక్కసారిగా గ్రౌండ్ లో కిందపడిపోయాడు. దీంతో తోటి స్నేహితులు అతని ఛాతిపై నొక్కి ఊపిరిపొసే ప్రయత్నం చేశారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అనూజ్ తండ్రి అమిత్ కుమార్ పాండే సీడ్ ఏజెన్సీలో పని చేస్తారు. ఆయనకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరైన అనూజ్ తన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే.. ఆట మధ్యలో అనూజ్ స్పృహ తప్పి పడిపోయాడని అతని స్నేహితులు తమకు సమాచారం ఇచ్చారని ఆయన వెల్లడించారు. వెంటనే తన కుమారుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారని.. కాగా, అప్పటికే అనూజ్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని ఆయన తెలిపారు. అనూజ్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, ఈమధ్య కాలంలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మరణించారు.
Anuj Pandey (16), Kanpur city in UP, was playing cricket with his friends as per his daily routine. While playing cricket, he ran to take a run, then he got dizzy & fell on the ground. Immediately after he was taken to hospital but died of #heartattack pic.twitter.com/1MlkjoGGCp
— BISHNU K JHA (@bisnujha) December 9, 2022