ప్రస్తుతం టీంఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉంది. దీనిలో భాగంగా తాజాగా జరిగిన రెండో వన్డే లో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీంఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తాను సెంచరీ చెయ్యనందుకు బాధగా ఉందన్నాడు. అలాగే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్ జట్టు ఉత్కంఠ విజయం తర్వాత టీంఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. ”మేమందరం డ్రస్సింగ్ రూంలో కూర్చుని ఉండగా ద్రావిడ్ సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు సూచనలు ఇస్తూనే ఉన్నాడు.” తాజాగా జరిగిన మ్యాచ్ లో మేమందరం చాలా బాగా ఆడాం. ఒత్తిడితో కూడిన మ్యాచ్ ల్లో ఎలా ఆడాలో మాకు తెలుసు.. ఒత్తిడిని మేం చాలా ప్రశాంతంగా జయించాం. గతంలో ఇలాంటి మ్యాచ్ లు చాలానే ఆడాం.” అని వివరించాడు. అలాగే అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ను గొప్పగా ముగించాడని ప్రశంసించాడు. మరి శ్రేయస్ అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One up (and running) 🇮🇳 pic.twitter.com/SWiy0MA9Ws
— Shreyas Iyer (@ShreyasIyer15) July 23, 2022
ఇదీ చదవండి: Sanju Samson: మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న సంజూను ముంచిన దీపక్ హుడా!
ఇదీ చదవండి: Axar Patel: సంచలన ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించిన అక్షర్ పటేల్! ధోని రికార్డు బద్దలు