టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏ జట్టు కూడా వరసగా రెండోసారి విజేతగా నిలబడలేకపోయింది. ఈసారి కూడా సేమ్ థియరీ వర్కౌట్ అయింది. సొంతగడ్డపై డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కనీసం సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో ఆ జట్టుపై చాలా విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ ఒకడు.. మొత్తంగా టీ20 క్రికెట్ పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి చర్చనీయాంశమయ్యాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అసలైన క్రికెట్ అంటే టెస్టులదే. ఐదు రోజుల పాటు జరిగే ఓ మ్యాచులో జట్టు ఎంత బలంగా ఉంది, ఆటగాళ్లలో ఎంత సత్తా ఉందనే విషయం తెలిసిపోతుంది. వన్డే క్రికెట్ వెలుగులోకి వచ్చేసరికి దీనికి ఆదరణ కాస్త తగ్గింది. చెరో 50 ఓవర్లపాటు ఉండే వన్డే మ్యాచులను ప్రేక్షకులు కాస్త ఆసక్తితో చూసేవారు. ఎప్పుడైతే టీ20 క్రికెట్ వచ్చిందో.. మొత్తం అన్ని ఫార్మాట్స్ పక్కకెళ్లిపోయాయి. చూసే ఆడియెన్స్ తోపాటు క్రికెటర్లు కూడా టీ20 ఫార్మాట్ కు బాగా అలవాటు పడిపోయారు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ప్రతి దేశంలోనూ ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. దీంతో క్రికెట్ అంటే టీ20లు మాత్రమే అనేలా మారిపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని ఎత్తిచూపిన పైన్.. ఈ ఫార్మాట్ పై మండిపడ్డాడు.
‘టీ20 క్రికెట్ పై నాకు అవగాహన ఉంది. ప్రపంచం మొత్తం ఫ్రాంచైజీ తరహా క్రికెట్ బాగా ఆడుతున్నారు. నాలుగేళ్లకొకసారి వరల్డ్ కప్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు పనికిమాలిన టీ20 క్రికెట్ చాలా ఆడేస్తున్నాం. అంతెందుకు ఈ ఏడాది కూడా వార్మప్ గేమ్స్, చాలా సిరీస్ లు ఆడేశాం. దీంతో చాలామంది టీ20లు చూడటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి టీ20లకు ఇది డేంజర్ బెల్ లాంటిది’ అని పైన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా జట్టు.. గత రెండేళ్లలో దాదాపు 44 టీ20 మ్యాచులాడింది. ఇందులో రెండు వరల్డ్ కప్స్ కూడా ఉన్నాయి.
Tim Paine believes that T20 internationals should only be played in World Cups every four years.#TimPaine #T20Iworldcup2022 #PakvsNz https://t.co/d5eqmiDnmF
— CricTracker (@Cricketracker) November 10, 2022