సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత భారత బౌలర్లు చెలరేగి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాను కేవలం 106 పరుగులకే కట్టడి చేశాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆరంభంలో తడబడ్డా తర్వాత కోలుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ గౌహతీలో అక్టోబర్ 2న జరగనుంది. కాగా.. ఈ ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
బావుమా మాట్లాడుతూ..‘పిచ్ ఇలా ఉంటుందని మేము అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం కానీ అందుకు భిన్నంగా ఉంది. ఇక పిచ్ పరిస్థితి తగ్గట్లు మా బ్యాటింగ్ లైనప్ ఆడలేకపోయింది. అదే మా ఓటమికి కారణమైంది. పేసర్లకు అనుకూలించిన పిచ్పై మా పేసర్లు మ్యాచ్ను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ.. వారి వద్ద కావాల్సినన్ని పరుగులు లేవు. మా స్పిన్నర్లు కూడా బాగా రాణించారు. ఇక ఈ మ్యాచ్లో మాకు లభించిన సానుకూల అంశం ఏమైన ఉందంటే అది.. మా ఇన్నింగ్స్లో రెండో భాగంలో చేసిన బ్యాటింగ్. టాపార్డర్ దారుణంగా విఫలమైనా, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకపోయినా.. రెండో అర్ధభాగంలో మా బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది.’ అని అన్నాడు.
బావుమా అన్నట్లు టీమిండియా బౌలర్లు కేవలం 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చినా.. సౌతాఫ్రికా 106 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగిందంటే గొప్ప విషయమే. సగం జట్టు రెండు అంకెల స్కోర్ దాటకముందే పెవిలియన్ చేరినా.. కేశవ్ మహరాజ్(41), మార్కరమ్(25), పార్నెల్(24) సౌతాఫ్రికా పరువుపోకుండా ఆదుకున్నారు. ముఖ్యంగా కేశవ్ మహరాజ్ మాత్రం విరోచితంగా పోరాడాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి.. టాప్ స్కోరర్గా నిలిచాడు. కేశవ్కు టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.
Here’s how Temba Bavuma, Rohit Sharma, KL Rahul and Arshdeep Singh reacted to India’s win over South Africa in the first T20I.#CricTracker #INDvSA #IndianCricketTeam #CricketSouthAfrica #RohitSharma #TembaBavuma #Cricket #SuryakumarYadav #KLRahul pic.twitter.com/wm4OqE24qM
— CricTracker (@Cricketracker) September 28, 2022
ఇది కూడా చదవండి: సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!