తాజాగా న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్వదేశంలో వరుస సిరీస్ లు నెగ్గుతూ అభిమానుల్లో జోష్ పెంచారు. తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న తీరు జట్టుపై అంచనాలను పెంచేస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా అత్యుత్తమ ఫామ్ కనబరుస్తోంది. వన్డేల్లో ఈ వరుస విజయాలు రాబోయే వన్డే వరల్డ్ కప్ పై ఆశలను పెంచుతున్నాయి. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ వరల్డ్ కప్ ని టీమిండియా గెలుస్తుందనడంలో సందేహం లేదు. అభిమానులు కూడా టీమిండియాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు.
స్వదేశంలో టీమిండియా ఇంతటి ఫామ్ కనబరచడం క్రికెట్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం. పైగా 2023 వన్డే వరల్డ్ కప్ భారతదేశంలోనే జరుగుతూ ఉండటంతో ఈ ఆశలను మరింత పెరిగిపోయాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడిన వన్డే సిరీసుల్లో వెస్టిండీస్ పై 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడం, ఆస్ట్రేలియాపై 2-1, ఇంగ్లాండ్ పై 2-1, వెస్టిండీస్ పై 3-0, సౌత్ ఆఫ్రికాపై 2-1, శ్రీలంకపై 3-0, న్యూజిలాండ్ పై కూడా వన్డే సిరీస్ ని వైట్ వాష్ చేశారు. ఈ గణాంకాలు చూస్తుంటే వచ్చే వరల్డ్ కప్ ఇండియా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఒక్కటే కాదు.. ప్రస్తుతం టీమిండియా రికార్డులు, ప్రదర్శన చూశాక వరల్డ్ కప్ గెలుస్తామని అభిమానులు మరింత గట్టిగా నమ్ముతున్నారు.
అతి భారీ తేడాతో విజయలా నమోదు చేయడం. తాజాగా శ్రీలంకపై టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం నమోదు చేసింది. రోహిత్ శర్మ 42 పరుగులకే పెవిలియన్ చేరగా.. విరాట్(166*), శుభ్ మన్ గిల్(116) చెలరేగడంతో 50 ఓవర్లలో 390 పరుగలు నమోదు చేసింది. తర్వాత టీమిండియా.. శ్రీలంకను కేవలం 73 పరుగలకే చుట్టేసింది. ఆ మ్యాచ్ లో సిరాజ్ కూడా 4 వికెట్లతో విజృంభించాడు. ఆ విజయం పరుగుల పరంగా వన్డేల్లో అత్యంత ఎక్కువ మార్జిన్ తో గెలిచినదిగా రికార్డు క్రియేట్ చేసింది.
శ్రీలంకపై టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. శ్రీలకంపై టీమిండియా 15 వన్డే సిరీస్లలో విజయం సాధించింది. మ్యాచ్ల పరంగా శ్రీలంకపై టీమిండియా 96 మ్యాచలలో విజయం సాధించింది. ఒక ప్రత్యర్థిపై ఇన్ని విజయాలు నమోదు చేయడంలో టీమిండియానే టాప్లేస్ లో ఉంది.
వన్డేల్లో టీమిండియా చాలా గొప్పగా రాణిస్తోంది. ముఖ్యంగా ఛేజింగ్ విషయంలో టీమిండియాకి ఎదురేలేదని చెప్పాలి. మొత్తం 536 వన్డే మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా వాటిల్లో 303సార్లు ఛేజింగ్ లోనే గెలిచింది. ఛేజింగ్ అంటే మన వాళ్లకు ఎంత ఇష్టమో ఈ గణాంకాలను చూస్తేనే తెలిసిపోతుంది. సెకండ్ బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాని ఓడిపోవడం దాదాపుగా అసాధ్యమనె చెప్పాలి.
ప్రస్తుతం టీమిండియాలో యంగ్ ప్లేయర్లు, సీనియర్లు అంతా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు ద్విశతకాలతో చెలరేగడం, విరాట్ కోహ్లీ వరుస శతకాలు నమోదు చేయడం, మహ్మద్ సిరాజ్, షమీ వంటి పేసర్లు బాల్ తో రాణించడం చూస్తుంటే టీమిండియా అభిమానులకు వన్డే వరల్డ్ కప్ పై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఆటగాళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే.. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ కొట్టడం టీమిండియా అంత కష్టం కాదనే చెప్పాలి.