ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్కు దూరమయ్యాడు. బుమ్రా జట్టులో ఉండడనే విషయం టీమిండియాతో పాటు, భారత క్రికెట్ అభిమానులను సైతం కలవరపరుస్తోంది. ఇప్పటికే బౌలింగ్ సమస్యతో మ్యాచ్ను చేజార్చుకుంటున్న భారత్కు టీ20 వరల్డ్ కప్లో బుమ్రా లేకపోవడం పెద్ద దెబ్బే. జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ బౌలర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ ఉన్నా బుమ్రా లేని లోటును భర్తీ చేయడం అంతసులువైన పనికాదు. ఆ విషయం ఆసియా కప్తోనే స్పష్టమైంది.
ఏడాది కాలంగా వరల్డ్ కప్.. వరల్డ్ కప్.. అంటూ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జట్టులో ఆటగాళ్ల స్థానాలను మార్చడం, వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఇవ్వడం, లేని ఆటగాళ్లను పక్కన పెట్టడం చేస్తూ వచ్చారు. తీరా వరల్డ్ కప్ ముంచుకొస్తున్న సమయానికి ద్రవిడ్ అనుకున్న ప్లాన్లు రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2022ను ఎలాగైనా సాధించాలని, దానికోసమే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు ద్రవిడ్, రోహిత్ చాలా ప్రకటించారు. అందుకోసం టీమిండియా బౌలర్లు మొహమ్మద్ షమీ, సిరాజ్, యువ బ్యాటర్ సంజు శాంసన్ లాంటి వారిని పక్కన పెట్టారు.
ఐపీఎల్ 2022లో మంచి ప్రదర్శన కనబర్చిన యువ బౌలర్ ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా లాంటి వారికి అవకాశాలు ఇచ్చారు. కానీ.. ఆసియా కప్కు ముందే ఆవేశ్ ఖాన్ చెత్త ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అతనికి ఇచ్చిన అవకాశాలన్నీ వృథా అయ్యాయి. ఇక దీపక్ హుడా ఐర్లాండ్ లాంటి పసికూనపై రాణించి కోచ్ దృష్టిని ఆకర్షించినా.. ఆసియా కప్లో ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పుడు వెన్ను నొప్పితో టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. ఇలా ద్రవిడ్ టీ20 వరల్డ్ కప్ ప్లాన్లో ఉన్న వారిలో ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, తాజాగా జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. వీళ్లతో పాటు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా గాయం కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు.
ఎవరైతే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేరని పక్కనపెట్టారో తిరిగి వాళ్ల టీమిండియా దిక్కయ్యేలా ఉన్నారు. మొహమ్మద్ షమీని ఆసియా కప్కు ఎంపిక చేయకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలెక్టర్లు ఆవెంటనే ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయడంతో పాటు టీ20 వరల్డ్ కప్ టీమ్లో స్టాండ్బై ప్లేయర్గా తీసుకున్నారు. బుమ్రా గాయంతో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరాజ్ను కూడా టీ20లకు పక్కన పెట్టిన సెలెక్టర్లు ఇప్పుడు సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20ల కోసం తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అలాగే జడేజా కోసం అక్షర్ పటేల్ను పక్కనపెట్టారు. కానీ.. ఆస్ట్రేలియాపై, ఇప్పుడు సౌతాఫ్రికాపై అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలా ద్రవిడ్ ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతున్నాయి. బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్కు దూరమవ్వడంతో.. అసలు వరల్డ్ కప్ జట్టుపై ఒక లుక్ వేస్తే.. బుమ్రాతో పాటు జడేజా కూడా దూరమయ్యాడు. దీపక్ హుడా వెన్ను నొప్పితో దూరమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Rohit Sharma Captain Of Team India & Rahul Dravid Head Coach Of Team India New Injured Era 🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂😂😂🤣😂🤣 https://t.co/Qmhoh6UB92 pic.twitter.com/nm6reNp3nK
— Virat (@Virat91721823) September 29, 2022
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ 2022: అప్పుడే మాటలతో కవ్వింపులు మొదలుపెట్టిన పాక్ పేసర్