ఏ ఫీల్డ్ అయినా సరే బాగా మెప్పించిన వారికి అభిమానులుంటారు. ఒకవేళ వాళ్లు ఫెయిలైతే.. అదే రీతిలో విమర్శించేవారు కూడా ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీ కావొచ్చు, క్రికెట్ కావొచ్చు. ప్లస్ ఉన్న చోటే మైనస్ కూడా ఉంటుంది. కానీ సదరు హీరోలు గానీ ఆటగాళ్లు గానీ ట్రోలింగ్ ని తీసుకోలేరు. ఏదో నార్మల్ గా ట్రోల్ చేస్తే పర్వాలేదు గానీ భరించలేనంత ఘోరంగా విమర్శలు చేస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక టీమిండియా బౌలర్ అర్షదీప్ పై కొన్నాళ్ల ముందు ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలెంట్ ఉంటే టీమిండియాలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడున్న చాలామంది ఆటగాళ్లు.. దేశవాళీ, ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి వచ్చిన వాళ్లే. ఇక పేసర్ అర్షదీప్ కూడా అలా జట్టులోకి వచ్చినవాడే. అయితే టీ20 వరల్డ్ కప్ లో సూపర్ గా బౌలింగ్ చేసిన మనోడు.. టాప్ వికెట్ కీపర్ గా ఘనత సాధించాడు. అయితే అంతకు ముందు జరిగిన ఆసియాకప్ లో మాత్రం తడబడ్డాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో అసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని వదిలేశాడు. ఫలితంగా టీమిండియా విన్నింగ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో నెటిజన్లు, అర్షదీప్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా ఖలీస్తానీ ఉగ్రవాది అని అన్నారు.
ఇక అర్షదీప్ వికిపీడియా పేజీలోనూ మార్పులు చేసి అతడిపై విమర్శలు చేశారు. అప్పుడే ఈ విషయమై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం.. వికిపీడియా అధికారులను వివరణ అడిగింది. ఇక న్యూజిలాండ్ తో మూడో వన్డే సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అర్షదీప్ ని దీని గురించే అడిగారు. దీనికి మనోడు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ‘క్రికెటర్లు, వారి గేమ్ ని ఫ్యాన్స్ ఎంతో ప్రేమిస్తారు. బాగా ఆడినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలవుతారో.. ఆడకపోతే అంతే డిసప్పాయింట్ అవుతారు. దేశం తరఫున ఆడుతున్నాం కాబట్టి మా విషయంలో ఎమోషనల్ అవుతుంటారు. మమ్మల్ని తిట్టే హక్కు వాళ్లకు ఉంది. క్రికెటర్ గా మేం ఆ రెండింటిని స్వీకరించాలి’ అని అర్షదీప్ చెప్పుకొచ్చాడు. మరి ఇతడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
We Rise Together🇮🇳✨ pic.twitter.com/YQLiczPTPw
— Arshdeep Singh (@arshdeepsinghh) November 22, 2022