టీ20 వరల్డ్కప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాక్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్, నెదర్లాండ్స్ పై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విక్టరీతో గ్రూప్ -2లో నాలుగు పాయింట్లతో టాప్లో నిలిచింది. దీంతో సెమీస్ అవకాశాలు మరింత పదిలమయ్యాయి. ఇదిలావుంటే ఈ మ్యాచులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉండేది.
రోహిత్ శర్మను అభిమానులు ముద్దుగా ‘హిట్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. ఇన్నాళ్లు ఆ పేరుకు అర్థం లేకపోయినా నేటితో ఆ బెంగ తీరింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో 39 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్.. 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ 3 సిక్సర్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ లో రోహిత్ ఓవరాల్ గా 34 సిక్సర్లు బాదాడు. దీంతో టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (33) పేరిట ఉండేది. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తొలి స్థానంలో(63) ఉండగా, 3. యువరాజ్ సింగ్ (33), 4. డేవిడ్ వార్నర్ (31), 5. షేన్ వాట్సన్ (31), 6. ఏబీ డివిలియర్స్ (30) తరువాత స్థానాల్లో ఉన్నారు.
History: Rohit Sharma becomes the leading six hitter by an Indian in T20 World Cup.
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
అలాగే.. ఈ మ్యాచులో హిట్ మ్యాన్ మరో రికార్డును అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ పొట్టి ప్రపంచకప్ లో 903 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే (1016) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (23 మ్యాచుల్లో 989), క్రిస్ గేల్ (33 మ్యాచుల్లో 965) టాప్ -3 లో ఉన్నారు. ఈ మ్యాచుకు ముందు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ (34 మ్యాచ్ లలో 897) 4 స్థానంలో ఉండేవాడు.
Most runs in T20 World Cup history:
Jayawardena – 1016
Kohli – 989 (Average is 89.9)
Gayle – 965— Johns. (@CricCrazyJohns) October 27, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ(62), సూర్యకుమార్ యాదవ్(51)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలా 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఒక వికెట్ పడగాఊటాడు. ఇక భారత్ తదుపరి మ్యాచులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 30న జరగనుంది.
Team India at the top. pic.twitter.com/5BchyaMeDZ
— Johns. (@CricCrazyJohns) October 27, 2022