వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఇప్పటికే బీసీసీఐ టీ20 జట్టును కూడా ప్రకటించింది. కాగా ఈ సిరీస్కు ముందు భారత్ భారీ ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా టీ20 సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ దీపక్ చాహర్, స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యారు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో దీపక్ గాయపడిన విషయం తెలిసిందే. దీపక్ చాహర్ కుడి తొడలో నొప్పి తీవ్రంగా ఉండడంతో శ్రీలంక సిరీస్కు దూరమయ్యాడని తెలుస్తోంది.
సూర్యకుమార్ కూడా గాయం కారణంగానే ఈ సిరీస్కు దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా సూర్యకుమార్ స్థానంలో తెలుగు తేజం అంబటి రాయుడు భారత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీపక్ ఆల్రౌండర్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. దీంతో రాయుడికి చోటు దక్కే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 UPDATE 🚨: Deepak Chahar and Suryakumar Yadav ruled out of @Paytm #INDvSL T20I Series. #TeamIndia
More Details 🔽
— BCCI (@BCCI) February 23, 2022