ఎప్పుడూ బ్యాట్, బాల్తో బిజీగా ఉండే టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సోమవారం శివభక్తిలో మునిగిపోయాడు. శ్రావణ మాసం సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మహాదేవుడి దయ, చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు రైనా తెలిపాడు.
కాగా.. శివ పూజలో లీనమైన రైనా ఆ శివుడి దీవెనలతో వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నట్లు రైనా ఫ్యాన్స్ ఆ పోస్టుకు కామెంట్ పెడుతున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాకపోవడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది.
మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన రైనాను.. సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా పట్టించుకోకపోవడంతో రైనా ఫ్యాన్స్ మనసునొచ్చుకున్నారు. కనీసం వచ్చే ఏడాది అయిన రైనా బరిలోకి దిగితే చూడాలని అతని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి వచ్చే ఏడాది రైనా ఐపీఎల్ అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
पवित्र श्रावण मास के प्रथम सोमवार की हार्दिक शुभकामनाएँ।
भगवान शिव आपको सुखी और समृद्ध जीवन दे।
जय भोलेनाथ॥
हर हर महादेव ॥❤️ pic.twitter.com/DFb8ryYrga— Suresh Raina🇮🇳 (@ImRaina) July 18, 2022