టీమిండియా-శ్రీలంక వన్డేలో షాకింగ్ సంఘటన జరిగింది. 42.5 ఓవర్ బంతి పడిన టైంలో కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అయితే కోహ్లీ కొట్టిన ఫోర్ ని అడ్డుకునే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర శ్రీలంక ఫీల్డర్స్ బలంగా గుద్దుకున్నారు. వీరిలో వాండర్ సే, ఆషెన్ బలంగా ఢీ కొన్నారు. ఆ వెంటనే బంతిని అందుకోవాలనుకున్నారు కానీ తల తిరిగినట్లు అనిపించడంతో గ్రౌండ్ లో కూలబడ్డారు. దీంతో శ్రీలంక ఫిజియోతో పాటు మెడికల్ సిబ్బంది వచ్చారు. ఆ తర్వాత టీమిండియా సిబ్బంది కూడా వెళ్లారు. ఇక పరిస్థితి సీరియస్ గా మారడంతో.. బందారాని స్ట్రెచర్ పై పడుకోబెట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మెడకు పట్టి కూడా కట్టడం ఫ్యాన్స్ ని ఆందోళన కలిగించింది.