కెరీర్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఓ యువ క్రికెటర్. జాతీయ జట్టుకు ఎంపికై 5 వన్డేలు, 18 టీ20 మ్యాచ్లు ఆడిన శ్రీలంక యువ క్రికెటర్ భానుక రాజపక్స క్రికెట్ గుడ్బై చెప్పాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు రాజపక్స పేర్కొన్నాడు. లంక బోర్డు సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. గతేడాది జూలైలో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాజపక్స.. ఈ 30 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం ఆర్నెళ్లు మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్లో 5 వన్డేలు, 18 టీ20లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్-2021 బరిలోకి దిగిన లంక జట్టులోనూ రాజపక్స ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో లంక బ్యాటర్గా నిలిచాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడి 155 పరుగులు చేశాడు. లంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్నెస్ మార్గదర్శకాల కారణంగానే రాజపక్స రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఈ కొత్త నిబంధనలతోనే రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. మరి ఈ యువ క్రికెటర్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వెనక్కి తగ్గిన క్వింటన్ డికాక్. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు మద్దతు