ఏ ఆటైనా సరే ఒక్క చిన్న తప్పు చాలు మొత్తం ఫలితమే మారిపోతుంది. మిగతా స్పోర్ట్స్ లో ఏమో గానీ క్రికెట్ లో అలాంటివి చాలా చూశాం. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించే మ్యాచులు, బ్యాటర్ లేదా బౌలర్ చేసిన పనివల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం, ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలవడం చూశాం. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రిపీటైంది. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తెగ బాధపడిపోతున్నారు. నో బాల్ వేయడం నేరమని అంటున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే… దుబాయిలో ఆసియాకప్ జరుగుతోంది. గురువారం బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ థ్రిల్లింగ్ గా సాగింది. ఇంకా చెప్పాలంటే చాలామంది బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. దానికి ఒకే ఒక్క కారణం ఎక్స్ ట్రాలు. బంగ్లా బౌలర్లు నియంత్రణ కోల్పోవడంతో ఏకంగా 17 ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చేశారు. ఇందులో ఐదు లెగ్బైస్, నాలుగు నో బాల్స్, ఎనిమిది వైడ్స్ ఉన్నాయి. ఓ టీ20లో ఇన్ని అదనపు పరుగులు ఇవ్వడంతో ఫలితమే తారుమారు అయిపోయింది.
‘స్పిన్నర్లు నో బాల్ వేయడం అంటే అతిపెద్ద క్రైమ్ చేసినట్టే. ఫాస్ట్ బౌలర్లు రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ని అందిపుచ్చుకోవడంలో వైడ్స్ పడుతుంటాయి. కానీ స్పిన్నర్స్ వైడ్ బంతులు వేయడంలో అస్సలు అర్థమే లేదు. మేం ఓడిపోవడానికి ప్రధాన కారణంగా ఎక్స్ట్రాలే. వైడ్స్, లెగ్బైస్, నో బాల్స్ చాలా పడ్డాయి. టీ20 ఫార్మట్లో ఇలాంటివి ఏ జట్టు విజయావకాశాలనైనా దెబ్బతీస్తుంది’ అని బంగ్లా కెప్టెన్ షకీబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో శ్రీలంక జట్టు.. ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు చేస్తే గెలుస్తుంది. ఆ టైమ్ లో బంగ్లా స్పిన్నర్ మెహదీ హాసన్ ఎక్స్ ట్రాలు ఇచ్చాడు. తొలి బంతి లెగ్బై కాగా.. రెండో బంతికి అసిత ఫెర్నాండో ఫోర్ బాదాడు. మూడో బంతి మళ్లీ నో బాల్. అక్కడే మ్యాచ్ ఖతమైంది. శ్రీలంక జట్టు సూపర్-4కు క్వాలిఫై కాగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగింది. మరి షకీబ్ నో బాల్ కామెంట్స్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్న శ్రీలంక! నాగినీ డ్యాన్స్తో రిటర్న్ గిఫ్ట్!