బీసీసీఐ రాజ్యంగంలో సవరణలకు సుప్రీంకోర్టు ఆమెదం తెలిపింది. దీంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా.. తమ పదవుల్లోనే కొనసాగనున్నారు. ఈ సెప్టెంబరుతో వారి పదవీకాలం పూర్తవుతుంది. ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ లో ఇప్పుడు మార్పులు జరగడం వల్ల మరో మూడేళ్లపాటు గంగూలీ-షా ద్వయం బీసీసీఐని ముందుండి నడిపించనుంది. 2019లో బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ.. బోర్డుని విజయవంతంగా నడిపిస్తూ వచ్చాడు.
బీసీసీఐ రాజ్యంగం ప్రకారం.. బీసీసీఐ లేదంటే రాష్ట్ర క్రికెట్ సంఘంలో మూడేళ్లపాటు, వరుసగా రెండుసార్లు మాత్రమే పనిచేసే అవకాశముంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడు కాకముందు గంగూలీ, 2014లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తే, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా జైషా విధులు నిర్వర్తించారు. దీంతో వారు కొనసాగే అవకాశం లేదు. ఇప్పుడు అదే విషయమై వాదనలు విని సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: ఉమెన్స్ టీమ్పై దాదా అభ్యంతరకర ట్వీట్! నెటిజన్లు ఫైర్