IPL.. వరల్డ్ వైడ్ ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ టోర్నీ. ఈ టోర్నీకి ఉన్న క్రేజ్ చూసే మిగతా దేశాలు కూడా తమతమ దేశాల్లో టీ20 టోర్నీలను నిర్వహించడం స్టార్ట్ చేశాయి. ఇక చాలా మంది క్రికెటర్లు ఈ ఐపీఎల్ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చారు అనేది కాదనలేని వాస్తవం. ఇక మాజీ క్రికెటర్లు సైతం ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎదో ఒక రూపంలో తమ సేవలను అందిస్తూ వస్తున్నారు. తాజాగా మరో టీమిండియా లెజెండ్ ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. గతంలో కోల్ కత్త నైట్ రైడర్స్ కు సారథ్యం వహించిన సౌరవ్ గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రముఖ వార్త పత్రిక PTI తెలిపింది.
సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్ర గతినే మలుపు తిప్పిన దిగ్గజ క్రికెటర్. అవసాన స్థితిలో ఉన్న భారత క్రికెట్ కు ఓనమాలు నేర్పించి వరల్డ్ క్రికెట్ లో ఓ పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇక తాను క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన సేవలను టీమిండియాకు అందిస్తూనే ఉన్నాడు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బీసీసీఐ అధ్యక్షుడిగా వైదొలిగిన సౌరవ్.. తాజాగా ఐపీఎల్ జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. గతంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు సారథిగా ఉన్న సౌరవ్.. పలు సీజన్లలో మెరుపులు మెరిపించాడు. అనంతరం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. అతడికి ఉన్న అనుభవం దృష్ట అతడిని డైరెక్టర్ గా నియమించినట్లు ఢిల్లీ క్యాపిటల్ తెలిపింది. మరి ఎంతో అనుభవం ఉన్న గంగూలీ సేవలను ఢిల్లీ ఏవిధంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.
Sourav Ganguly is set to be appointed as the Director of cricket of Delhi Capitals. (Source – PTI)
— Johns. (@CricCrazyJohns) January 3, 2023
Sourav Ganguly will take care of the team development of Delhi Capitals, Dubai Capitals & Pretoria Capitals. (Source – RevSportz)
— Johns. (@CricCrazyJohns) January 3, 2023