టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కుక్కల సంహారంపై ఆందోళన వ్యక్తం చేశాడు. కేరళలో భారీ సంఖ్యలో కుక్కలను చంపుతున్నట్లు తెలిసిందని.. దయజేసి కుక్కల సంహారాన్ని నిలిపివేయాలని ట్విట్టర్ వేదికగా రిక్వస్ట్ చేశాడు. కాగా ధావన్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సహజంగానే జంతు ప్రేమికుడైన ధావన్.. కుక్కలను భారీ సంఖ్యలతో సంహరిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ విధంగా స్పందించాడు. కాగా.. కేరళలో గత కొన్ని రోజులుగా కుక్కలను భారీ సంఖ్యలో చంపుతున్నట్లు సమాచారం. కుక్కలు పిచ్చిపట్టినట్లు పెద్దలు, పిల్లలపై దాడి చేసి గాయాలపాలు చేస్తున్నాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు తమ ఊర్లోని కుక్కలను అంతం చేసేందుకు గుంపులుగా మారి చంపుతున్నారు.
కుక్కలను భారీ సంఖ్యలో చంపుతున్న వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియాలో కూడా వీటికి సంబంధించిన కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ విషయంపై స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళలో కుక్కల సంహారం నిలిపివేయాలని ధావన్ చేసిన ట్వీట్కు భిన్నస్పందనలు వస్తున్నాయి. ధావన్ ట్వీట్కు రిప్లే ఇస్తూ.. కుక్కలు పిల్లలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అవి ఇలా దాడిచేస్తున్నాయి కనుకే.. కుక్కలను చంపుతున్నట్లు వారు పేర్కొంటున్నారు.
కాగా.. ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ధావన్కు చోటు కల్పించలేదు. చాలా కాలంగా ధావన్ను వన్డే ఫార్మాట్కు మాత్రమే పరిమితం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేని సమయంలో శిఖర్ ధావన్ టీమిండియాకు వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ సంగతి అలా ఉంచితే.. కేరళలో కుక్కల సంహారంపై ధావన్ స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: టీమిండియాలో జడేజా లేనిలోటు నేను తీరుస్తా: యువ క్రికెటర్
This is so horrifying that mass killing of dogs in #kerala is taking place. I would request to reconsider such moves and put an end to these brutal killings.
— Shikhar Dhawan (@SDhawan25) September 16, 2022