IND vs ZIM 1st ODI: జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మొదట బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ – శుభ్మన్ గిల్ రాణించడంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా ఓపెనర్లే అలవోకగా టార్గెట్ పూర్తి చేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 30.5 ఓవర్లలోనే 192 పరుగులతో జట్టును గెలిపించారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్గా ధావన్ రికార్డులకెక్కాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్.. వంటి దిగ్గజాలు ధావన్ కంటే ముందువరుసలో ఉన్నారు.
వన్డేల్లో 6500 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు:
6500 ODI runs and counting for @SDhawan25 👏👏#ZIMvIND pic.twitter.com/WVEWQ4ETuX
— BCCI (@BCCI) August 18, 2022
ఇక.. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు శుభ్మాన్ గిల్(82), ధావన్(81) పరుగులతో నాటౌట్గా నిలిచి భారత్కు విజయాన్ని అందించారు.
It’s advantage #TeamIndia as they secure a comfortable 🔟 wicket win courtesy of a brilliant 1️⃣9️⃣2️⃣ run partnership between the openers.
Shikhar Dhawan – 8️⃣1️⃣*(113)
Shubman Gill – 8️⃣2️⃣*(72)📸 – BCCI#PlayBold #ZIMvIND pic.twitter.com/6yzxYFFiEz
— Royal Challengers Bangalore (@RCBTweets) August 18, 2022
ఇదీ చదవండి: IPL vs PSL: పాకిస్థాన్ కొంపముంచిన ICC! ఇరకాటంలో పాకిస్థాన్ బోర్డు!
ఇదీ చదవండి: BCCI Test: అంపైర్లకు పరీక్ష పెట్టిన బీసీసీఐ.. 140 మందిలో ముగ్గురే పాస్..!