క్రికెట్ అంటే కోట్లు కురిపించే ఆట మాత్రమే కాదు. ఓ ప్రొఫెషనల్ గేమ్ కూడా. గెలుపు, ఓటములను పక్కన పెడితే.., గ్రౌండ్ లో దిగాక అందరూ జెంటిల్మెన్స్ గా ప్రవర్తించాల్సిందే. ఇందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఇంత ఆదరణ దక్కుతోంది. కానీ.., ఇప్పుడు మాత్రం యావత్ క్రికెట్ సమాజం నివ్వెరపోయే ఘటన చోటుచేసుకుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్ క్రికెట్ లోకం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., ప్రస్తుతం ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా అబహాని లిమిటెడ్, మహమ్మెదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఇక్కడ బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మహమ్మెదన్ స్పోర్టింగ్ క్లబ్ కి సారధ్యం వహిస్తున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ టీమ్ 145 రన్స్ చేసింది. అనంతరం అబహాని లిమిటెడ్ టీమ్ బ్యాటింగ్కు దిగగా.., ఐదవ ఓవర్ వేయటానికి షకీబ్ రంగంలోకి వచ్చాడు.
షకీబ్ వేసిన ఈ ఓవర్ లో బంగ్లా మరో స్టార్ బ్యాట్సమెన్ ముష్షికర్ వరుసగా బౌండరీస్ కొట్టాడు. ఆ మరుసటి బంతి అతని బ్యాట్ను మిస్సై, ప్యాడ్ ని తాకింది. దీంతో షకీబ్ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ.., అంపైర్ మాత్రం వెంటనే నాటౌట్ అనడంతో షకీబ్ సహనాన్ని కోల్పోయాడు. ఆగ్రహంతో అంపైర్ పైకి దూసుకెళ్తూ.., నాన్స్ట్రైకర్ ఎండ్లోని వికెట్లను కాలితో తన్నాడు. ఆ తర్వాత మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న అతను.. అంపైర్ తప్పిదాలకు విసుగు చెంది, నాన్ స్ట్రైకర్ వికెట్లను పీకిపారేసాడు. దీంతో.., షకీబ్ చర్యలకి అంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు. కాగా.., ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యావత్ క్రికెట్ లోకం షకీబ్ తీరుని తప్పుబట్టడంతో.., అతను ఇప్పుడు బహిరంగ క్షమాపణలు కోరాడు. “నేను అలా ప్రవర్తించాల్సింది కాదు. నా చర్యల పట్ల సిగ్గుపడుతున్నా. ఇకపై ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటా. అందరికీ క్షమాపణలు” అంటూ షకీబ్ అల హాసన్ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. ఈ విషయంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి.., యువ క్రికెటర్స్ ఆదర్శంగా నిలవాల్సిన షకీబ్ లాంటి సీనియర్ ఆటగాడు ఇలా ప్రవర్తించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.