బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఏ, న్యూజిలాండ-ఏ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్ సౌరభ్ కుమార్ అదరగొట్టాడు. కివీస్ కుర్రాళ్లను తన స్పిన్తో వణికించాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌరభ్ ఏకంగా 17.4 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అన్ని ఓవర్లు బౌలింగ్ వేసినా సౌరభ్ కుమార్ కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా 4 కీలక వికెట్లు పడగొట్టి.. సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. సౌరభ్ 4 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ 71.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 86.4 ఓవర్లలో 293 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రుతురాజ్ గైక్వాడ్(127 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 108) సెంచరీతో దుమ్మురేపాడు. ఉపేందర్ యాదవ్ 76 పరుగులతో రాణించాడు. దీంతో ఇండియా-ఏ భారీ స్కోర్ సాధించింది. కివీస్ బౌలర్లలో ఫిషర్ 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ రెండు, జో వాకర్ రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసి ఆడుతోంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్(17 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ 18 నాటౌట్ క్రీజ్లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్లో సౌరభ్ కుమార్ బౌలింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Left-arm spinner Saurabh Kumar picked up 4 for 48 to help India A take a first-innings lead of 56 against New Zealand A after they were bowled out for 293
— ESPNcricinfo (@ESPNcricinfo) September 17, 2022
ఇది కూడా చదవండి: వెంకటేశ్ అయ్యర్ను బౌలర్ ఎందుకు కొట్టాడు? ఇప్పుడు అయ్యర్ పరిస్థితి ఎలా ఉందంటే?