Sarfaraz Khan: ఏ ఫార్మేట్ క్రికెట్ లో అయినా.. ఓ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం అనేది గొప్ప విషయమే. ఇక శతకం సాధించాక ఒక్కో బ్యాట్సమెన్ ఒక్కోలా తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఇండియన్ రంజీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తాజాగా సెంచరీ కొట్టి గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ, తొడకొట్టి భావోద్వేగానికి గురయ్యాడు. మరి.. సర్ఫరాజ్ ఖాన్ అలా చేయడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై-మధ్య ప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అయితే.. ముంబై జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమై ఆటతీరుతో శతకం సాధించి జట్టుకి ఈ గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్ ఖాన్ ఈ రంజీ సీజన్ లో 900 పరుగులను పూర్తి చేసుకున్నాడు. పైగా.. అతనికి ఈ సీజన్ లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. సర్ఫరాజ్ ఖాన్ గత రంజీ సీజన్ లో కూడా 900 పరుగుల పైనే పరుగులు సాధించాడు.
ఇలా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నా. సర్ఫరాజ్ ఖాన్ కి మాత్రం టీమిండియాలో స్థానం దక్కడం లేదు. ఆ బాధతోనే సర్ఫరాజ్ ఇలా గ్రౌండ్ లో కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సర్ఫరాజ్ సెంచరీ సెలబ్రేషన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
💯 for Sarfaraz Khan! 👏 👏
His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍
This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc
Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV
— BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022
ఇవి కూడా చదవండి : DK: అటు టీమిండియాలో, ఇటు ర్యాంకింగ్స్ లో అదరకొట్టిన దినేశ్ కార్తిక్.. ఏకంగా 108 స్థానాలు జంప్!