ఉన్ముక్త్ చంద్.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. 2012లో భారత్కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో సెంచరీతో టీమిండియాను విశ్వవిజేతగా నిలిచాడు. దాంతో ఉన్ముక్త్ చంద్ పేరు ఇండియన్ క్రికెట్లో మారోమోగిపోయింది. ఈ యువ క్రికెటర్కి భారీ క్రేజ్ ఏర్పడింది. వెంటనే ఐపీఎల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. అలాగే దేశావాళీ క్రికెట్లోనూ ఆడాడు. కానీ.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. దాదాపు 9 ఏళ్లు అవకాశాల కోసం ఎదురుచూసి.. చూసి.. చివరి భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని.. యూఎస్కేకి వెళ్లిపోయాడు. టీమిండియా పట్టించుకోకపోవడంతోనే ఉన్ముక్త్ చంద్ లాంటి యంగ్ ప్లేయర్ విదేశాలకు తరలిపోయాడనే వాదన కూడా ఉంది.
అయితే.. 2021లో టీమిండియాకు గుడ్బై చెప్పిన ఉన్ముక్త్ చంద్, యూఎస్ మైనర్ టోర్నీలో ఆడుతూ.. అమెరికా జట్టు తరఫున వరల్డ్ కప్లో ఆడేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్లో పాల్గొన్నాడు. ఆ లీగ్లో మెల్బోర్న్ రెనెగేట్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. బిగ్ బాష్ లీగ్లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్గా ఉన్ముక్త్ చంద్ నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడనున్నాడు. చిట్టగాంగ్ ఛాలెంజర్స్ జట్టు తరఫున చండ్ బరిలోకి దిగనున్నాడు. అయితే.. ప్రస్తుతం భారత్లో మరో ఉన్ముక్త్ చంద్ తయారవుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు ఆందోళలన చెందుతున్నారు. సంజు శాంసన్ కూడా మరో ఉన్ముక్త్ చంద్లా మారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
వారి ఆందోళనకు కారణం.. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న సంజు శాంసన్కు టీమిండియాలో సరైన అవకాశాలు ఇవ్వకపోవడమే. కేరళకు చెందిన సంజు శాంసన్.. ఐపీఎల్లో అదరగొట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే దేశవాళీ టోర్నీల్లోనూ బాగానే రాణిస్తున్నాడు. చాలా కాలంగా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయినా కూడా సంజుకు టీమిండియాలో సరైన అవకాశాలు రావడంలేదు. తనకంటే వెనుక వచ్చి.. వరుసగా విఫలం అవుతున్న రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి వారికి మాత్రం బోలెడు అవకాశాలు ఇస్తున్నారు. సంజు 2015లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇంకా జట్టులో అతనికి సుస్థిర స్థానంలేదు. పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వీళంతా సంజు తర్వాతే భారత జట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022కు సంజు శాంసన్ను ఎంపిక చేయనందుకే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసినా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా శాంసన్ను తుది జట్టులో ఆడించలేదు. అతని స్థానంలో వరుసగా విఫలం అవుతున్నా.. పంత్నే జట్టులోకి తీసుకున్నాడు. దీంతో మరోసారి సంజుకు అన్యాయం జరిగిందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా కూడా.. బీసీసీఐ సంజును బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేయకుండా.. మళ్లీ పంత్, ఇషాన్ కిషన్నే ఎంపిక చేసింది. ఇలా ప్రతిసారి తీవ్ర అన్యాయానికి గురవుతున్న సంజు శాంసన్ కూడా ఏదో ఒక రోజు విరక్తిచెంది.. టీమిండియాకు గుడ్బై చెప్పి ఉన్ముక్త్ చంద్లా విదేశీ లీగులు ఆడే ప్రమాదం ఉందని.. బీసీసీఐ అందుకు కారణంగా నిలుస్తుందని.. క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Unmukt Chand! pic.twitter.com/KVbm9wEZhc
— RVCJ Media (@RVCJ_FB) November 23, 2022
Tripathi, Patidar ahead of Sanju Samson really ? Sanju Samson averages 83 & SR 107 in ODI 2022 shame on you. Politics has ruined Indian cricket 👎🏻 pic.twitter.com/EryYDmD0o2
— Roshmi 🏏 (@CricGalRoshmi) November 23, 2022
Sanju Samson’s ODI Career:
Innings: 9
Runs: 294
Average: 73.50
Best: 86*
Strike Rate: 106.13And Still looking for a permanent slot.#SanjuSamson
— Raju Jangid (@imRJangid) November 24, 2022