రన్ మెషిన్.. కింగ్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కోహ్లీ సెంచరీ ఎప్పుడు చేస్తాడు అందు ట్రోల్ సెహెస్తున్న మాట కూడా నిజమే. కానీ అతని కెప్టెన్సీని మాత్రం ఎవరూ తప్పు పట్టరు. కానీ వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమంటూ కామెంట్ చేశాడు.
‘విరాట్ కోహ్లీని భారత అల్ టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేం. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేని వ్యక్తిని అలా ఎలా పరిగణిస్తాం? గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వాళ్ళతో పోలిస్తే విరాట్ చేసిందేమీ లేదు. మీడియా వల్లే కోహ్లీకి అర్హతకు మించిన పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఆటగాడిగా మాత్రం కోహ్లీ తన పాత్రకు న్యాయం చేశాడు. భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్లలో ధోని ముఖ్యుడు. ధోని కెప్టెన్సీలోనే భారత్ అంతర్జాతీయ వేదికలపై అద్భుత విజయాలు నమోదు చేసింది. కెప్టెన్ గెలుపునకు ఐసీసీ విజయాలే కొలమానం. ఆ విషయంలో ధోని దరిదాపుల్లో కూడా కోహ్లి ఉండడు. స్వదేశంలో విజయాలు, ద్వైపాక్షిక సిరీస్ల్లో విజయాలను ఐసీసీ ఈవెంట్ల గెలుపుతో పోల్చి చూడలేం.’
కెప్టెన్సీ విషయంలో కోహ్లికి ప్రత్యేక స్టైల్ ఉందని, పరాజయాన్ని అంత సులువుగా ఒప్పుకోడని.. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో అది మరోసారి రుజువైందని గుర్తు చేశాడు. కోహ్లి ఎంతటి పోరాటపటిమ ప్రదర్శించినా దురదృష్టం వెంటాడిందని అన్నాడు. మరి సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.