ఐపీఎల్లో మేటి ప్రదర్శనతో టీమిండియాలో స్థానం సంపాదించాడు టి.నటరాజన్. అంతే కాదు మూడు ఫార్మాట్లలో ఒకే టూర్లో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా నటరాజన్ రికార్డు సృష్టించాడు. 2020- 21 టీమిండియా ఆస్ట్రేలియా టూర్కి వెళ్లినప్పుడు ఈ ఫీట్ జరిగింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున అద్భుత యార్కర్లు వేసి వికెట్లు తీస్తుంటాడు.
అసలు సంగతి ఏంటంటే.. ఇప్పుడు టీమిండియాకి మరో నటరాజన్ దొరికేశాడంటూ అభిమానులు సంబరపడి పోతున్నారు. నటరాజన్ వచ్చిన అదే తమిళనాడు నుంచి పెరియస్వామి అనే పేరు బాగా వైరలవుతోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో పెరియస్వామి వికెట్లు తీసిన వీడియో ఒకటి తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో పెరియస్వామి బౌలింగ్ యాక్షన్ అచ్చు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగను పోలినట్లు ఉంది. ఇక యార్కర్ వేసే స్టైల్ చూస్తే నటరాజన్ను గుర్తు చేస్తున్నాడు.
స్టైల్లో మలింగను, యార్కర్స్లో నటరాజన్ను గుర్తుచేస్తున్న పెరియస్వామి త్వరలోనే టీమిండియాలో స్థానం సంపాదిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక, పెరియస్వామి వికెట్లు తీసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మీరు ఒకసారి చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.