క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన తర్వాత సచిన్ టెండూల్కర్ సామాజిక సేవ ఎక్కువగా చేస్తున్నారు. తన వంతుగా సమాజానికి చేతనైనంత సాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెంటిల్మన్ గేమ్లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్లో ఒక బ్యాటర్గా ఆయన సాధించని రికార్డులు లేవు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు సచిన్. ఒకప్పుడు టీమిండియా అంటే సచిన్, సచిన్ అంటే టీమిండియా అనేలా ఉండేది. సచిన్ను ఔట్ చేస్తే చాలు.. భారత్ పని అయిపోయినట్లేనని ప్రత్యర్థి జట్లు భావించేవి. క్రికెట్లో ఎన్నో అద్భుతాలు చేసిన సచిన్.. రిటైర్మెంట్ అనంతరం ఎక్కువగా సామాజిక సేవ చేస్తూ గడుపుతున్నారు. సాయం కోరిన వారికి అండగా నిలబడుతున్నారు మాస్టర్ బ్లాస్టర్.
సచిన్ టెండూల్కర్ తాజాగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలనే సంకల్పంతో ఆయన ఒక పాఠశాలను నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సందల్పూర్లో కట్టనున్న ఈ స్కూలు పనులను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ఈ స్కూలు ద్వారా రాబోయే దశాబ్ద కాలంలో 2,300 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని మాస్టర్ బ్లాస్టర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాఠశాలను తన తండ్రి రమేశ్ టెండూల్కర్, తల్లి రజినీ టెండూల్కర్లకు సచిన్ అంకితం ఇస్తున్నారు. పిల్లలకు ఉచిత విద్య అందించాలని సచిన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చదివించాలనే సచిన్ సంకల్పం గొప్పదని కొనియాడుతున్నారు.
Sachin Tendulkar foundation will build a school in Sandalpur that will provide free education for 2300 children over the next decade as a tribute for his father who was a professor.
Great gesture from God of Cricket. pic.twitter.com/uVjUL9uiEH
— Johns. (@CricCrazyJohns) May 3, 2023