సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా ఐదు టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను భారత్ బౌలర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ద్వయం దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మన్లు తేలిపోయారు. ఒక్కరు కూడా 30 పరుగులు స్కోర్ చేయలేకపోయారు. భారత బ్యాటర్లలో రుతురాజ్ గౌక్వాడ్(35 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 54), హర్షల్ పటేల్(4 వికెట్లు), చాహల్(3 వికెట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు ఘన విజయం దక్కింది.
అయితే రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించడమే కాదు.. ఒకే ఓవర్లో వరుసగా 5 ఫోర్లు కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన నోర్జేకు చుక్కలు చూపించాడు. ఓవర్ లో వరుస 5 బంతులను బౌండిరీకి తరలించి ఔరా అనిపించాడు. ఆఖరి బంతిని డాట్ బాల్ గా వేసి నోర్జే కాస్త పరువు కాపాడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ గురించే చర్చ జరుగుతోంది. రుతురాజ్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో సెహ్వాగ్ ను గుర్తుచేశాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.