గాయంగా కారణంగా సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్కు దూరమైన టీమిండియా టీ20, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహ్యాబ్ అవుతున్నాడు. గాయం నుంచి కోలుకుని.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎన్సీఏకు రిహ్యాబ్ సెంటర్కు వెళ్లారన్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుంటునే.. అక్కడ శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. యువ ఆటగాళ్లకు తన అనుభవంతో క్లాసులు చెప్తున్నాడు. వాటిని యువ క్రికెటర్లు ఎంతో శ్రద్ధగా వింటున్నారు.
రోహిత్ శర్మ యువ ఆటగాళ్లతో తన అనుభవాలు పంచుకుంటూ.. విలువైన సూచనలు చేస్తున్న ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. కాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైవ్వడంతో పాటు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను పొందిన రోహిత్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. దీంతో సిరీస్కు దూరమై.. ఎన్సీఏకు చేరుకున్నాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని రోహిత్శర్మ చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నాడు. టీమిండియాకు రెండు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్.. భవిష్యత్ క్రికెటర్లను దగ్గర చూసే అవకాశం వచ్చింది. దీంతో ఆటగాళ్లను మరింత మెరుగుపెట్టి.. వారిని జాతీయా స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.
అందులో భాగంగానే మైదానంలో అనుసరించాల్సి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి గురించి యువ క్రికెటర్లకు వివరిస్తున్నాడు. అవకాశం ఉంటే ఇందులో కొంతమంది తన కెప్టెన్సీలో టీమిండియాకు ఆడే ఛాన్స్ రావచ్చు. ఆ సమయంలో ఎవరి సామర్థ్యం ఏమిటో రోహిత్కు తెలుస్తుంది కాబట్టి.. వారు టీమిండియాలో ఈజీగా రాణించవచ్చు. ఈ విధంగా రోహిత్ పరోక్షంగా తన టీమ్ను ఇక్కడి నుంచే నిర్మించుకుంటున్నట్లే అర్థం అవుతుంది. మరి ఎన్సీఏలో రోహిత్ శర్మ యువ క్రికెటర్ల ఇస్తున్న సలహాలు, సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్ అయిన ఆనందంలో.. భార్యకి భారీ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!
Priceless lessons 👍 👍
📸 📸 #TeamIndia white-ball captain @ImRo45 made most of his rehab time as he addressed India’s U19 team during their preparatory camp at the NCA in Bengaluru. pic.twitter.com/TGfVVPeOli
— BCCI (@BCCI) December 17, 2021