బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత్ పరాభవం చవిచూసింది. మూడు వన్డేల సిరీస్ని బంగ్లాదేశ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథా పోయింది. 5 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా పేలవ బౌలింగ్ మరోసారి కష్టాలు తెచ్చి పెట్టింది. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 69 పరుగులు చేసిన బంగ్లాదేశ్ చేత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసేలా చేశారు. 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్లోనూ తడబడింది. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్(82), అక్షర్ పటేల్(56) పోరాడినా కూడా అవకాశం లేకుండా పోయింది.
మ్యాచ్ మొత్తం కోల్పోయామనే తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో బ్యాటింగ్కి దిగాడు. తొలి ఇన్నింగ్స్ లో రెండో ఓవర్లో క్యాచ్ పట్టబోయి గాయం పాలైన రోహిత్.. మైదానాన్ని వీడాడు. ఇంక ఈ మ్యాచ్లో ఆడడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా రోహిత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టాడు. దిగిన కాసేపటికే సిక్సులు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విజృంభించాడు. కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వేలికి గాయం ఉన్నా కూడా ప్లాస్టర్ వేసుకుని మరీ రోహిత్ ఆడిన తీరుకు నెట్టింట ప్రశంసలు లభిస్తున్నాయి. చివరికి రోహిత్ ఒంటరి పోరాటం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోయింది. రోహిత్ పోరాటం చూసి అంతా మ్యాచ్ గెలిచేశాం అనుకున్నారు.
We fought hard till the end, but it was Bangladesh who won the 2nd ODI by 5 runs and clinch the series 2-0.
Scorecard – https://t.co/e77TiXcHlu #BANvIND pic.twitter.com/yjD9hu8m7I
— BCCI (@BCCI) December 7, 2022
కానీ, ఒక్క ఓవర్తో మ్యాచ్ మొత్తం తిరిగబడింది. రోహిత్ శర్మ రూపంలో మ్యాచ్ మీద చిగురించిన ఆశలు అన్నీ.. సిరాజ్ రూపంలో ముక్కలయ్యాయి. ఈ మ్యాచ్ మొత్తం సిరాజ్ బ్యాట్కి బాల్ని కనెక్ట్ చేయడానికే చాలా తిప్పలు పడ్డాడు. 48వ ఓవర్ అయితే ఏకంగా మెయిడెన్గా మారింది. ముస్తాఫిజుర్ ఎంతో తెలివిగా అన్నీ స్లోవర్ డెలివిరీలు మాత్రమే వేశాడు. కానీ, సిరాజ్ బ్యాట్కి కూడా ఆ బంతులు తాకలేదు. సిరాజ్ కూడా ఎంతో అసహనం వ్యక్తం చేశాడు. కానీ, ముస్తాఫిజుర్ తాను ఎందుకు టాప్క్లాస్ బౌలర్ అని పేరు సంపాదించుకున్నాడో అందరికీ తన ఓవర్ ద్వారా తెలియజెప్పాడు. సిరాజ్ బౌలర్ కావచ్చు.. కానీ, సింగిల్ తీసుకుని స్ట్రైక్ ఛేంజ్ చేయలేకపోవడం అందినీ ఆగ్రహానికి గురిచేసింది.
Highlights of #RohitSharma 51* off 28 vs Bangladesh with broken thumb. #INDvsBAN pic.twitter.com/zwPbcRo9a0
— ” (@Sobuujj) December 7, 2022
ఈ మ్యాచ్లో 12 బంతులు ఎదుర్కొన్న మహ్మద్ సిరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. మహ్మదుల్లా వేసిన స్లోవర్ డెలివరీకి బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ సిరాజ్కి స్లోవర్ బంతులే వేశారు. అతను ఔట్ అవ్వడం కంటే క్రీజులో ఉంటేనే వారికి లాభం అని గుర్తించిన బంగ్లాదేశ్ బౌలర్లు తమ ప్రణాళికని అమలు చేయడంలో బాగానే సక్సెస్ అయ్యారు. ఓవైపు రోహిత్ శర్మ సిక్లుతో విరుచుకుపడుతుంటే.. అతనికి స్ట్రైకింగ్ రానివ్వకుండా చేసి మ్యాచ్ని గెలిచేశారు. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో సిరీస్ కూడా కోల్పోయాం. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ తీసుకొచ్చినా కేవలం 5 పరుగులతో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు మింగుడు పడటం లేదు. ఓటమికి సిరాజే కారణం అంటూ కామెట్ చేస్తున్నారు.
Massive Respect Hitman @ImRo45 What a fight 🙏🙏💞💞#RohitSharma #IndvBan pic.twitter.com/2a790Ar6qF
— Rahul Sisodia (@Sisodia19Rahul) December 7, 2022