రానున్న రోజుల్లో టెస్ట్ వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించనున్నారా? అంటే బీసీసీఐ నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ టీ20లకు కెప్టెన్ నుంచి నిష్రమించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే కెప్టెన్ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించారు. ఇక టెస్ట్ క్రికెట్ విషయానికోస్తే.. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానె కొనసాగుతున్నాడు. గత రెండేళ్ల నుంచి టెస్ట్ లో రహానె ప్రతిభను కనబరచకపోవడంతో ఇతనిని పక్కకు పెట్టే ఆలోచనలో బీసీసీఐ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ రహానెను గనుక వైస్ కెప్టెన్ నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ కు టెస్ట్ వైస్ కెప్టెన్ గా కూడా అదనపు బాధ్యతలు తోడవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీసీసీఐ త్వరలో అధికారిక ప్రకటనను వెలువరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.