బంగ్లాదేశ్తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఇక మూడో వన్డేలోనైనా గెలిస్తే.. పరువు కాస్త నిలుస్తుంది. లేదంటూ.. ఇప్పటికే పతాళానికి పడిపోయిన పరువు.. మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ వరుస ఓటములను భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో పసికూన జట్టుగా పేరమోస్తున్న బంగ్లాదేశ్ జట్టు.. పటిష్టమైన టీమిండియాను రెండు వరుస మ్యాచ్ల్లో ఓడించడం కంటే దారుణం ఇంకొటి ఉండదంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ రెండు విజయాలు బంగ్లాదేశ్కు ఏదో గాలివాటంగా వచ్చిన విజయాలు కాదు.. ఓడిపోయే స్థితిలో టీమిండియా నుంచి మ్యాచ్ను లాక్కొని మరీ గెలిచింది. ప్రపంచాన్ని శాసించే జట్టుగా టీమిండియా ఉండాలని ఆశపడుతున్న క్రికెట్ అభిమానులకు ఈ ఓటములు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
కాగా.. ఈ ఓటములపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘హాఫ్ ఫిట్నెస్తో ఉన్న ఆటగాళ్లతో మ్యాచ్లు గెలవలేం. పూర్తి స్థాయిలో ఫిట్నెస్తో లేనప్పుడు బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి.. తమ సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. వందశాతం ఫిట్నెస్తో ఉన్నప్పుడు మాత్రం దేశం తరఫున ఆడాలి’ అంటూ రోహిత్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. కాగా.. రోహిత్ ఇంతలా ఆవేదన చెందడానికి కారణం ఉంది. రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. గాయాలు కూడా ఒక కారమనే చెప్పాలి. ఈ మ్యాచ్లో టీమిండియా తొలుత బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. టీమిండియా మెయిన్ బౌలర్ దీపక్ చాహర్ కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి.. తొడ కండారు పట్టేయడంతో గ్రౌండ్వీడాడు. అలాగే బ్యాటింగ్కు వచ్చినా.. పెద్దగా రాణించలేదు.
అలాగే మరో యువ పేసర్ కుల్దీప్ సేన్ సైతం తొలి మ్యాచ్ ఆడి గాయపడ్డాడు. రెండో వన్డేకు దూరమయ్యాడు. ఇక మరో ఆల్రౌండర్ శార్థుల్ ఠాకూర్ సైతం పూర్తి ఫిట్నెస్తో లేడని సమాచారం. దీంతో టీమిండియాకు బౌలింగ్ అప్షన్స్ తక్కువయ్యాయి. కేవలం సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే పేస్ బౌలర్లలో పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్నారు. మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో పాటు సిరాజ్, ఉమ్రాన్ 30 ఓవర్లు పూర్తి చేసినా.. మరో 20 ఓవర్లు మిగిలి పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టైనా.. వన్డే ఫార్మాట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్తో రెండో వన్డేలో టీమిండియాకు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. దీంతో 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. 271 పరుగులు చేయగలిగిందంటూ అందుకు బౌలింగ్ అప్షన్స్ తక్కువగా ఉండటం కూడా ఒక కారణమే. ఈ విషయంపైనే స్పందించిన రోహిత్ శర్మ.. పూర్తిగా ఫిట్గా లేనప్పుడు జాతీయ జట్టుకు ఎందుకు ఆడటం.. ఎన్సీఏకు వెళ్లి ఫిట్నెస్ సాధించాలని సూచించాడు. కాగా.. ఈ మ్యాచ్లో రోహిత్ సైతం క్యాచ్ పట్టబోయి గాయపడ్డాడు. అయినా కూడా చివర్లో బ్యాటింగ్కు వచ్చి.. టీమిండియాను గెలిపించేందుకు తన శక్తికి మించి ప్రయత్నించాడు. చిత్తుగా ఓడుతుందనుకున్న టీమిండియా.. రోహిత్ విరోచిత పోరాటంతో కేవలం 5 పరుగుల తేడాతో ఓడింది.
Rohit Sharma said “It’s not ideal to have play with half fit players, need to sit down at NCA and get to know the problem – you need to be more than 100% fit to play for the country”.
(Talking about too many injuries in the camp)
— Johns. (@CricCrazyJohns) December 7, 2022