టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్ అదే ఊపులో.. రెండో టెస్ట్ ను కూడా గెలుచుకుని, వన్డే సిరీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇక తాజాగా జరుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఇప్పుడిప్పుడే మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. స్వల్ప వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ను రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లు ఆదుకున్నారు. 5వ వికెట్ కు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
రిషబ్ పంత్.. గత కొంత కాలంగా వస్తోన్న విమర్శలకు తాజాగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో.. తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. టాపార్డర్ దారుణంగా విఫలం అయిన చోటే.. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు పంత్. తనదైన మార్క్ షాట్స్ తో మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ.. బౌలర్లకు చుక్కలు చూపించాడు. 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ను పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం దెబ్బకు కేఎల్ రాహుల్(10), గిల్(20), పుజారా(24) తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరారు. ఈ తరుణలో ఆదుకుంటాడు అనుకున్న విరాట్ కోహ్లీని టస్కిన్ అహ్మద్ 24 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్.. అయ్యర్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Another heartbreak for Rishabh Pant as he missed out on a well-deserving hundred by just seven runs.
For the sixth time, Pant has been dismissed in the nervous 90s.#CricTracker #Test #RishabhPant #BANvIND pic.twitter.com/bTac8IILiN
— CricTracker (@Cricketracker) December 23, 2022
ఈ క్రమంలోనే అర్దశతకం బాది సెంచరీ వైపు దూసుకెళ్తున్న పంత్ ను మెహదీ హసన్ బోల్తా కొట్టించాడు. పంత్ 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లతో 93 పరుగులు చేసి.. సెంచరీకి ఏడు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. దాంతో శ్రేయస్ అయ్యర్ తో కలిసి 5వ వికెట్ కు నెలకొల్పిన 159 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పంత్ ఇన్నింగ్స్ లో 58 పరుగులు బౌండరీలు, సిక్స్ ల ద్వారా రావడం విశేషం. మరో వైపు సెంచరీ సాధిస్తాడు అనుకున్న అయ్యర్ సైతం పంత్ నిష్క్రమించిన కొద్ది సేపటికే 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 7 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. క్రీజ్ లో రవిచంద్రన్ అశ్విన్(7), జైదేవ్ ఉనద్కత్(5) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 51 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
A top knock from Shreyas Iyer comes to an end.#CricTracker #Test #ShreyasIyer #BANvIND pic.twitter.com/EZ4k3sfdWs
— CricTracker (@Cricketracker) December 23, 2022