భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన విజయాన్ని నమోదు చేసింది. సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి, 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ విమెన్ ప్లేయర్గా నిలిచింది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. పీవీ సింధుకు ఇది తొలి టైటిల్ కాగా, భారత్ కు మూడోది.
తొలి సెట్లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి.. ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా వాంగ్ జి యి చివరి వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది.
Delighted as our ace badminton player @Pvsindhu1 claims gold by winning first Super 500 Title of 2022 at the Singapore Open. Congratulations to her. The whole nation revels in your victory. Best wishes for future. #SingaporeOpen2022 #PVSindhu pic.twitter.com/4HGYVu6DKT
— Basavaraj S Bommai (@BSBommai) July 17, 2022
పీవీ సింధుకు ఈ ఏడాదిలో ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్లో సూపర్ 300 టైటిల్స్ను సింధు సాధించింది. ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్గా సింధు రికార్డులకెక్కింది. కాగా గతంలో 2010లో సైనా సెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
SHE DID IT 👑@Pvsindhu1 went all guns blazing against 🇨🇳’s Wang Zhi Yi to beat her 21-9, 11-21, 21-15 & win her 3rd title of the year at #SingaporeOpen2022 🏆🥇
Congratulations champ! 🥳
Picture Credit: @bwfmedia @himantabiswa @sanjay091968 #IndiaontheRise#Badminton pic.twitter.com/BIcDEzCz9z
— BAI Media (@BAI_Media) July 17, 2022
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగం చేసిన భారత క్రికెటర్లు వీరే!
ఇది కూడా చదవండి: కోహ్లీ అంటేనే ఒక బ్రాండ్.. అతన్ని తప్పిస్తే అన్ని బోర్డులకు కోట్లలో నష్టం: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్