బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనడంలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రకటించారు. తన పిల్లలను వదిలి, ఇండియాకు రాలేకపోతున్నానని ప్రీతి వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని మిస్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా వేలంలో తమ ప్రణాళిక, ఆటగాళ్ల కొనుగోలు గురించి తన టీమ్తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రీతి వెల్లడించారు.
తమ టీమ్ ఫ్యాన్స్ సలహాలను కూడా పరిగణంలో తీసుకుని పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ను రూ.12 కోట్లకు, అన్క్యాప్డ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ రోజు పంజాబ్ బ్యాటింగ్ కోచ్గా ఉన్న వసీం జాఫర్ తన పదవికి రాజీనామా చేశారు. మరి జింటా వేలంలో పాల్గొనకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This year I’m going to miss the IPL Auction as I cannot leave my little ones & travel to India.The last couple of days have been hectic discussing d auction & all things cricket with our team.I wanted to reach out to our fans & ask them if they hv any player suggestions.. pic.twitter.com/oIOCqZT3PN
— Preity G Zinta (@realpreityzinta) February 11, 2022