ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఆడే అన్ని మ్యాచ్లను చూడని వారు, క్రికెట్పై అంతగా ఇంట్రస్ట్ లేనివాళ్లు సైతం పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్లు లేని కారణంగా.. పెద్దపెద్ద టోర్నీల్లోనే రెండు జట్ల మధ్య మ్యాచ్లు చూసే అవకాశం లభిస్తుంది. దీంతో దాయాదుల పోరుకు మరింత డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఆసియా కప్ వేదికగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీని గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆసియా కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అప్పుడే జట్టును కూడా ప్రకటించేసింది. బాబర్ అజమ్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. టీమ్లో బాబర్ అజమ్(కెప్టెన్) మొహమ్మద్ రిజ్వాన్(కీపర్), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, కుష్దిల్ షా, ఇఫ్తికర్ అహ్మెద్, ఆసీఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాదిర్, షాహీన్ అఫ్రీది, హరిస్ రౌఫ్, షానావాజ్ దహని, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ ఉన్నారు.
ఈ జట్టులో దాదాపు టీ20 వరల్డ్ కప్లో భారత్తో తలపడిన టీమ్ సభ్యులే ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను ధావన్ కెప్టెన్సీలో ఆడనుంది. మరి ఈ సిరీస్ తర్వాత టీమిండియా సెలెక్టర్లు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా పాకిస్థాన్ మాత్రం 25 రోజులు ముందుగానే ఆసియా కప్కు జట్టును ప్రకటించి అందర్ని ఆశ్యర్యపరిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chief selector Muhammad Wasim is addressing the media at GSL regarding the 🇵🇰 squads announced for the Netherlands ODIs and ACC T20 Asia Cup.
Watch live ➡️ https://t.co/JMxzcwyn0s#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/3WQQUr5ech
— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022
🇵🇰✈️
🚨 Pakistan’s squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨
Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy
— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022