సౌతాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన టీమిండియా మూడో టీ20లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంత్ సేన సఫారీలపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టి కృషితో టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంత్ సేన.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. హర్షల్ పటేల్(4 వికెట్లు), చాహల్(3 వికెట్లు) రాణించడంతో సౌత్ ఆఫ్రికాకి ఓటమి తప్పలేదు.
టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు) ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. ఇషాన్ కిషన్ సిరీస్ మొత్తం నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. తొలి టీ20లో అర్ధశతకంతో రాణించిన ఇషాన్ మూడో టీ20లోనూ అర్ధశతకం(35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు) నమోదు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సౌత్ ఆఫ్రికా విఫలమయ్యింది. క్లాసెన్(29), హెన్డ్రిక్స్(23), పార్నెల్(22) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
First win as #TeamIndia 🇮🇳 Captain 👌👌
Well done, @RishabhPant17! 👏👏#INDvSA | @Paytm pic.twitter.com/3fhaXK24XX
— BCCI (@BCCI) June 14, 2022
మ్యాచ్ సంగతి పక్కన పెడితే మూడో టీ20లో వైజాగ్ స్టేడియం మొత్తం పవన్ మేనియాతో ఊగిపోయింది. మ్యాచ్ మధ్యలో భీమ్లానాయక్ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్ వేయడంతో.. పవన్ అభిమానులంతా రచ్చరచ్చ చేశారు. స్టేడియం మొత్తం కాసేపు పవన్ పేరు మారుమ్రోగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. పవన్ కల్యాణ్ మేనియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#LalaBheemla Song In Today’s #INDvsSAT20 Match (Vizag) ❤️🔥🔥@PawanKalyan pic.twitter.com/cUdY7z4iyV
— Ardent PawanKalyan Fans™ (@ArdentPSPKFans) June 14, 2022