పురుషుల క్రికెట్కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2023 నుంచి 2027 కాలానికి గాను పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్కప్స్తో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్లు కూడా ఉన్నాయి. అయితే.. పాక్తో భారత ద్వైపాక్షిక సిరీస్లకు ఇందులో చోటు కల్పించలేదు. కానీ, ఈ షెడ్యూల్.. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది.
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో పోరు సంగతి పక్కనబెడితే ఆటగాళ్లు, అభిమానులే కాకుండా దేశ ప్రజలు కూడా విజయం కోసం ప్రార్థిస్తుంటారు. ఇప్పటివరకు.. అభిమానుల వరకే ఆగిన ఈ పోరు.. ఇప్పుడు బోర్డులు వరకు వచ్చేలా ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇరు బోర్డులూ ముఖాముఖి తలపడకున్నా అంతకంటే రసవత్తర సమరమే జరిగేట్టు ఉంది. క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తో ఢీకొనేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సిద్ధమవుతోంది.
ICC men’s events between 2024 and 2031 👇 pic.twitter.com/eglkGTmVb1
— Govardhan Reddy (@gova3555) August 18, 2022
అసలు విషయానికొస్తే.. ఐసీసీ విడుదల చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం.. 2025లో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. దీని కారణంగా పీసీబీ.. తమ ఆధ్వర్యంలో నిర్వహించే పీఎస్ఎల్ ను వాయిదా వేయనుంది. పీఎస్ఎల్ సాధారణంగా డిసెంబర్-జనవరిలలో జరుగుతుంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పీఎస్ఎల్ ను వాయిదా వేయనుండడంతో.. ఈ మెగా టోర్నీని మార్చి/మేలో జరిపేందుకు సన్నాహకాలు చేస్తోంది. అంటే.. అది ఐపీఎల్ తో ప్రత్యక్షంగా ఢీకొన్నట్టే.
Here are India’s fixtures from the ICC FTP for 2022 to 2027. pic.twitter.com/MqCCEQRqvk
— 100MB (@100MasterBlastr) August 17, 2022
ఐపీఎల్ సీజన్ ప్రతి ఏడాది మార్చి-మేలో ఉంటుంది. దీంతో మార్చి నుంచి మే వరకు ఎప్పుడు పీఎస్ఎల్ జరిపినా అది ఇరు బోర్డుల మధ్య యుద్ధమే. ఐపీఎల్ లో ఆడే పలువురు ఆటగాళ్లు పీఎస్ఎల్ లో కూడా ఆడతారు. దీంతో ఆటగాళ్ల డేట్స్ తో పాటు షెడ్యూల్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరు దేశాల బోర్డులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.