మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాలోకి అడుగు పెట్టింది న్యూజిలాండ్ జట్టు. పాకిస్థాన్ పై విజయం సాధించి ఉత్సాహంతో భారత్ వచ్చిన కివీస్ జట్టుకు.. టీమిండియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది భారత జట్టు. ప్రపంచ స్థాయి జట్టుగా పేరుగాంచిన కివీస్.. భారత్ చేతిలో క్లీన్ స్వీప్ కావడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ నిరాశకు గురైయ్యాడు. ఇక చివరి వన్డేలో ఓటమికి రెండు కారణాలను చెప్పుకొచ్చాడు కివీస్ సారథి. ఆ రెండు తప్పులే మా ఓటమిని శాసించాయి అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నాడు.
మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. అదీకాక ఈ సిరీస్ విజయంతో వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది టీమిండియా. ఇక మూడో మ్యాచ్ లో ఓటమి గురించి.. మ్యాచ్ అనంతరం స్పందించాడు కివీస్ సారథి టామ్ లాథమ్. ప్రపంచ కప్ కు ముందు ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి కఠిన పరిస్థితులు ఎంత ఎదురైతే.. అంత ఎక్కువగా పాఠాలు నేర్చుకోవచ్చు అని లాథమ్ అన్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మా ఓటమికి రెండు కారణాలు ఉన్నాయి. ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి అని అతడు తెలిపాడు. అవేంటంటే?
మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, అలాగే ఛేజింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం. ఈ రెండే మా ఓటమికి ప్రధాన కారణాలు అని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా ఓపెనర్లు గిల్-రోహిత్ లు అసాధారణంగా చెలరేగారు. వారిని అడ్డుకోవడం మా బౌలర్ల వల్ల కాలేదని ఈ సందర్బంగా అతడు తెలిపాడు. అయినా గానీ మధ్యలో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 450 దాటుతుంది అనుకున్న టీమిండియా స్కోరును 385 పరుగులకే పరిమితం చేశాం అని లాథమ్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ కు ముందు మాకు ఇది ఓ గుణపాఠం. ఈ సిరీస్ లో మాకు ఇండియాలో ఎలా ఆడాలో ఓ ఐడియా వచ్చిందని టామ్ పేర్కొన్నాడు. మరి కివీస్ కెప్టెన్ ఓటమికి చెప్పిన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.