ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది.. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నిలిచింది.. టీమిండియా తిరిగి అంతర్జాతీయ టూర్లలో బిజీగా ఉంది. అయితే ఇంకా ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం ఈ సీజన్ గురించి మర్చిపోలేకపోతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు టైటిల్స్ సాధించిన జట్టు టేబుల్ లో ఆఖరి స్థానానికి పరిమితమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే యాజమాన్యం కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాబోయే సీజన్ గురించి ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలు పెట్టేసింది. అందులో భాగంగా ముందుగా ముంబై ఇండియన్స్ కుర్రాళ్లకు తర్ఫీదు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ముంబై ఇండియన్స్ లోని అన్ క్యాప్డ్ ప్లేయర్లను రాటు తేల్చేందుకు ఇంగ్లాండ్ లో టీ20 మ్యాచ్లు ఆడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లాండ్లోని టాప్క్లాస్ కౌంటీ క్లబ్లతో దాదాపు 10 టీ20 మ్యాచ్లు ఆడించేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఆ జట్టులో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు కూడా అవకాశం దక్కినట్లు ముంబై ఇండియన్స్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్ దీప్ సింగ్, హృతిక్ షోకీన్ వంటి ప్లేయర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ యూకే చేరుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ బ్రెవిస్ కూడా ఈ జట్టుతో కలవనున్నాడు. ఇంక ఈ టూర్ పై బీసీసీఐ అనుమతి తీసుకున్నారా అనే ప్రశ్నకు.. ‘అన్ క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ టూర్కు తీసుకెళ్తున్నాం. ఇది కమర్షియల్ టూర్ కాదు కాబట్టి బీసీసీఐ అనుమతి అవసరం లేదు’ అంటూ వెల్లడించారు. ఇంక తిలక్ వర్మ విషయానికి వస్తే అరంగేట్ర సీజన్లోనే 397 పరుగులతో ముంబై జట్టు నుంచి టాప్ స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. తిలక్ వర్మకు ఇంగ్లాండ్ కౌంటీలతో మ్యాచ్ ఆడే అవకాశం రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence.” 💯
Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs
— Mumbai Indians (@mipaltan) May 26, 2022