టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తన మొట్టమొదటి మ్యాచ్ను దాయాది పాకిస్తాన్తో ఆడింది. నిజానికి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి, ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరాలనే భారీ అంచనాలు ఇరు జట్లపై ఉంటాయి. అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్కు ముందు ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్కు పాకిస్తాన్పై తిరుగులేని రికార్డు ఉంది. టాస్ కీలమైన మ్యాచ్లో దురదృష్టవశాత్తు భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లు విఫలం అయినా మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకున్నా కెప్టెన్గా కోహ్లీ ఒక్కడే ఆ మ్యాచ్లో బాగా ఆడి జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 10 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. భారీ అంచనాల మధ్య జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమి భారత్ క్రికెట్ అభిమానులను నిరాశపర్చింది. మరికొంత మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. సోషల్ మీడియాలో చాలా మంది తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ఇలాంటి సాధారణం కానీ.. ఒక వ్యక్తిని అతని మతం ఆధారంగా టార్గెట్ చేశారు కొంతమంది. అతనే టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమి. గతంలో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఆటగాడ్ని కేవలం ఒక మ్యాచ్లో ఫెయిల్ అవ్వడంతో ఇంతలా దాడికి దిగుతార అని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు నిర్ఘంతపోయారు.
ఇదీ చదవండి: షమీనా మజాకా… సిక్స్ బాది హాల్ఫ్ సెంచరీ
దాడిని ఖండిస్తూ సచిన్, సెహ్వాగ్ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు షమికి మద్దతుగా నిలిచారు. అలాగే టీమిండియా కెప్టెన్ కూడా షమికి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో షమిపై దాడికి దిగిన వారికి కాస్తా గట్టిగానే వారించాడు. వెంటనే కోహ్లీ కూతుర్ని కూడా అత్యాచారం చేస్తాం అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. వాస్తవానికి పాకిస్తాన్తో మ్యాచ్లో ఒక్క కోహ్లీ తప్పా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం అయ్యారు. కానీ కొంతమంది షమిని మాత్రమే టార్గెట్ చేసి దాడికి దిగారు. ఆ తర్వాత న్యూజిల్యాండ్తో జరిగిన మ్యాచ్ అంతకంటే దారుణంగా జట్టు మొత్తం విఫలం అయింది. క్రికెట్ భావోద్వేగాలతో కూడింది. కానీ ఇంతలా ఒక ఆటగాడిపై అసభ్యంగా విరుచుకుపడ్డం గతంలో జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా షమి తనపై జరుగుతున్న దాడి గురించి స్పందించలేదు. తనపై జరిగిన దాడిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తన సత్తా ఎంటో మరోసారి నిరూపించాడు. కీలమైన 3 వికెట్లు తీసి మ్యాచ్లో టీమిండియా తరఫున హైయస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. దీంతో షమి తనపై జరిగిన దాడికి మాటలతో కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాడాని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా మ్యాచ్లన్నీ 7.30 నిమిషాలకే జరగడానికి కారణమేంటి?
When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.
I stand behind Shami & Team India.
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021