భారత సీనియర్ బ్యాటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్…అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు మిథాలీ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేసింది. క్రికెటర్గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.
1982, డిసెంబర్ 03న రాజస్థాన్, జోధ్ పూర్ లో జన్మించిన మిథాలీ.. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. తన సుదీర్ఘ ప్రయణంలో.. ఎన్నో మరుపురాని రికార్డులు ఉన్నాయి. పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళల క్రికెట్కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే.. మహిళకు క్రికెట్ ఎందుకు అనే సమాజం మనది. అలాంటి సమాజంలోనూ మిథాలీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. వన్డేల్లో 63 హాఫ్ సెంచరీలు చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసిన మిథాలీ, 23 ఏళ్లుగా క్రికెట్లో కొనసాగుతోంది. సచిన్ టెండూల్కర్ కంటే సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్ కొనసాగించిన మిథాలీ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా టాప్లో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమెదే. 232 మ్యాచులకు ప్రాతినిధ్యం వహించిన మిథాలీ.. వన్డేల్లో 7000 పరుగులు మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్ కావడం విశేషం.
Cricketer Mithali Raj announces retirement from all forms of international cricket.
“It was an honour to have led the team for so many years. It definitely shaped me as a person & hopefully helped shape Indian Women’s Cricket as well,” her statement reads. pic.twitter.com/2eWZLPTrco
— ANI (@ANI) June 8, 2022
కాగా.. మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శభాష్ మిథు’. హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.